ఎస్మా ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం – ఎస్టీటీఎఫ్

WhatsApp-Image-2024-01-07-at-10.32.04-PM-scaled.jpeg

ఆత్మకూరు: గత 26 రోజులుగా అంగన్వాడీ ఉపాధ్యాయులు ,ఆయాలు తమ న్యాయపరమైన సమస్యల పరిస్కారానికి సమ్మె చేస్తుండగా ప్రభుత్వం వారి సమస్యల పరిస్కారానికి ప్రయత్నం చేయకూండా వారి మీద అత్యవసర సర్వీసుల (ఎస్మా)చట్టం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్టీటీఫ్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సుధాకర్,కుమార్ లు అన్నారు. జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ అధ్యక్షతన ఆదివారం,ఆత్మకూరు లో జరిగిన ప్రాంతీయ సమావేశములో వారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సమావేశములో వారు మాట్లాడుతూ ,అంగన్వాడీలను చర్చలకు పిలిచి వారి డిమాండ్స్ పరిష్కారములో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని,నిర్బంధ చట్టాలు పరిష్కారం కాదని ప్రజాస్వామిక పద్దతిలో చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని అన్నారు.జిల్లా గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ ,కార్మిక ,పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిల కొరకై ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే వారితో కలిసి ఉద్యమించడానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.ఈ సమావేశములో రాష్ట్ర నాయకులు ధరణికుపేంద్ర, మతృనాయక్,వెంకట రాముడు జిల్లా నాయకులు నాగరాజు,రాము,కేశాలు నాయక్,శేఖర్ నాయక్, రాం బాలాజీ నాయక్, మల్లికార్జున నాయక్, శోభన్ బాబు నాయక్,పుల్లన్న, వెంకటేశ్వర్లు, నాయక్, రాజానాయక్ ,పేరయ్య,చంద్రానాయక్ ,సంజమ్మ, లక్ష్మీదేవి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top