అడవి పందులను తరిమి కొట్టే లైట్ – ROTATINGH LIGHT

Wild boars run wild ligh

Wild boars run wild ligh

ఈ అద్బుతమైన లైట్ ను ఉపయోగించి.. పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల బెడద నుండి రైతులు ఉపశమనం పొందవచ్చు.. ఈ లైటును ఒక కర్రకు గాని ఒక ఇంచు పైపుకుగాని సెట్ చేసి పొలం మద్యలో పాతితే తనచుట్టూ తనుతిరుగుతూ.. కళ్ళు జిగేల్ మనీ పించే అద్బుతమైన కాంతితో ఈ లైట్ పనిచేస్తుంది. అడవి పందులు పొలంలోకి వచ్చిన ఈ లైటింగ్ కళ్ళకు పడేసరికి పందులు పరిపోతాయి . ఒక మనిషే నిలబడి లైట్ వేశాడాని అవి బావించి పరిపోతాయి. ఈ అద్బుతమైన లైట్ ను ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కంపెనీ తయారు చేసి Amazan, https://amzn.to/4bW8wsw సైట్ లో..అందుబాటులో ఉంచింది. ఈ లైట్ ను ఉపయోగించిన రైతులు చాలా సంతోస పడుతున్నారు.

కడప జిల్లా వేంపల్లె : అరటి పంటతో డబ్బులు సంపాదించాలనే ఆశతో భూమిని కౌలుకు తీసుకొని అరటి పంటను సాగు చేస్తే అడవి పందులు సాగు చేసిన అరటి పంటను పీకి వేయడం జరిగింది. దీంతో దాదాపు రూ 6 లక్షల వరకు నష్టం జరిగిందని కౌలు రైతులు లబోదిబోమంటున్నారు.వేంపల్లె పోలంలో రామగంగిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి అనే రైతులు ఎకరాకు 30 వేలు కౌలుతో 11 ఎకరాల్లో అరటి పంటను సాగు చేశారు.అరటి పంటను సాగు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలకు వెళ్లి అరటి పిలకలను తెచ్చుకోని పూడ్చడం జరిగింది. అరటి పంట మంచి దిగుబడి వచ్చేందుకు నీటి సౌకర్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డ్రిప్ ఏర్పాటు చేయడంతో పాటు ఎరువులు వేయడం జరిగిందని కౌలు రైతులు రామగంగిరెడ్డి, ఈశ్వర్ రెడ్డిలు చెప్పారు. పంటను కాపాడుకొంటూ వస్తుండగా గురువారం అర్థరాత్రి అడవి పందుల మంద.. అరటి పంటపై పడి దాదాపు 4 ఎకరాల్లో అరటి పీలకలను దున్నేయడం జరిగిందని వాపోయారు. కంటికి రెప్పల పంటను కాపాడుకొంటూ వస్తున్న సమయంలో ఒక సారిగా అడవి పందుల వలన పంట సాగుకు పూర్తిగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు కాకుండా అరటి పంటను సాగు చేసేందుకు ఇప్పటి వరకు.. ఒక ఎకరాకు రూ 1.50 లక్షలు ఎరువులకు, అరటి పీలకలకు, కూలీలకు పెట్టుబడి కింద ఖర్చు చేసినట్లు తెలిపారు.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

అడవి పందులు దాదాపు నాలుగు ఎకరాల్లో పంటను నష్టం చేయడంతో దాదాపు రూ 6 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు. కొండ ప్రాంతం దగ్గరగా ఉండడంతో అడవి పందుల మంద పడినట్లు చెప్పారు. అరటి పీలకలను నాటి 3 నెలలు కావస్తున్నదని కౌలు రైతులు వాపోయారు. పీలకలను నాటిన తర్వాత కుందేల బెడద కూడ ఎక్కువగా ఉండేదని వాటి నుండి రక్షించుకొన్న తర్వాత అడవి పందులతో పంట పూర్తిగా దెబ్బతిందని వాపోయారు.

అడవి జంతువులు పంటలపై దాడి

రాత్రి సమయంలో అడవి జంతువులు పంటలపై దాడి చేయడంతో రైతులు కోలుకోలేక పోతున్నట్లు తెలిపారు. సరిపోని వారు కూడ ఈ విధంగా అరటి పీలకలను పీకరని దాని కంటే ఘారంగా అడవి జంతువులు పంటను నాశనం చేశాయని అవేదన వ్యక్తం చేశారు. పంటను కాపాడుకొనేందుకు పగలంతా పంట పోలాల్లోనే సమయాన్ని వెచ్చిస్తున్నామని అయితే రాత్రి సమయంలో వచ్చే అడవి జంతువులతో రైతులు పూర్తిగా నష్ట పోతున్నట్లు చెప్పారు. పంటలు సాగు చేసేందుకు అప్పులను తెచ్చి పంట సాగు చేసినప్పటికీ పంట చేతికి రాక ముందే ఇలాంటి ఘటనలతో నష్టాల భారిన పడుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పంటను సాగు చేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. పంట నష్టంపై అటవీ, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిశీలించి తమకు ఆర్థికంగా నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతులు కోరారు.

Amazan, https://amzn.to/4bW8wsw

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top