మనిషికి శాపం ! – చందమామ కథలు

manishiki shapam Chandamama kathalu

manishiki shapam Chandamama kathalu

పట్నం వెళ్లిన తన కొడుకు ప్రతాపుడు, చీకటి పడిన తర్వాతగాని రాడనుకున్న అతడి తల్లి జయమ్మ, సూర్యాస్తమయం కాకుండానే తిరిగి రావడం చూసి, “ఈ రోజు అరటిగెల త్వరగా అమ్ముడుపోయినట్లుంది!” అన్నది. ప్రతాపుడు కష్టజీవి, ఇంటి వెనక మురుగునీరు పారేచోట అరటి మొక్కలు నాటాడు. ముదిరిన అరటి గెలలు పట్నం తీసుకువెళ్లి సంతలో అమ్మితే, ఎంతలేదన్నా గెలకు వంద రూపాయలు వస్తాయి.
ప్రతాపుడి భార్య విమల, భర్తకోసం మంచినీళ్లు తీసుకువచ్చి, “పిల్లలు బడి జీతాలు రేపే కట్టాలట!” అన్నది.
“అలాగా ! ఎన్నో నెలలుగా కష్టపడి పెంచిన అరటిగెల అమ్ముడుపోయినా, ఆ డబ్బు అనుభవించే ప్రాప్తంలేని బతుకు. అంతా నా ఖర్మ” అని విసుక్కుంటూ, అరటిగెల అమ్మగా వచ్చిన డబ్బు విమలచేతిలో పెట్టాడు ప్రతాపుడు.

“అంతలా చిరాకుపడితే ఎలారా?” అన్నది జయమ్మ.
“లేకపోతే నాన్న చేసిన పనికి ఆనందపడాలా?” అన్నాడు ప్రతాపుడు కోపంగా. ఆ మాటలకు జయమ్మ తెల్లబోతూ, “పదేళ్ళ క్రితం పోయిన మీ నాన్నను, ఇప్పుడు అడిపోసుకుంటున్నావు. దేనికి?” అని అడిగింది. ప్రతాపుడు కొద్దిసేపు మౌనంగా వూరుకుని, “అమ్మా జరిగిందేమిటో నీకు తెలియంది కాదు. నాన్న స్నేహితుడు నరసింహం పదిహేనేళ్ళ క్రితం, ఇక్కడి పొలాలు అమ్మేసుకుని పట్నంలో వ్యాపారం పెట్టి,నాన్నను కూడా రమ్మన్నాడు. నాన్నకు పుట్టిపెరిగిన ఊరు వదలడం ఇష్టంలేదు.

ఇప్పుడు మనకు మిగిలింది. నాలుగెకరాలు. దానిమీద వచ్చే ఆదాయంతో ఐదుగురం బతకాలి. నాన్న కూడా వ్యాపారంలో దిగితే ఎంత బావుండేది!” అన్నాడు. దానికి జయమ్మ నిట్టూర్చి, “బావుంది! ఆపైవాడు ఎవరికి ఎంత రాస్తాడో, అంతే దక్కుతుంది” అన్నది. “అలా వేదాంతం చెప్పకు. ఆ నరసింహం కొడుకు గోవిందం, నా ఈడువాడే. ఎంత సుఖంగా వున్నాడు! పట్నానికీ, మన ఊరుకూ మధ్యవున్న అడవిలోని ఋషీశ్వరుడిని దర్శించడానికి గుర్రపు బగ్గీలో వెళుతూ, నడిచి వస్తున్న నన్ను బగ్గీలో ఎక్కించుకున్నాడు. వాడి వైభోగం చూస్తూంటే నా గుండె రగిలిపోతోంది” అన్నాడు ప్రతాపుడు కోపంగా.

Also Read తిరమందార్ల స్పెషల్ బంగి ఉండలు – లివర్ పచ్చడి

కొడుకు కోపం చూసి జయమ్మ మరి మాట్లాడలేదు. ఆ రాత్రి విమల “మీరు కూడా వెళ్ళి ఆ ఋషీశ్వరుడిని చూడకూడదా? ఆయన కనికరిస్తే మన జీవితాల్లో ఏమైనా మార్పురావచ్చు” అన్నది భర్తతో.
భార్య సలహా నచ్చిన ప్రతాపుడు, ఆ మర్నాటి ఉదయానే ఋషీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఋషీశ్వరుడు, ప్రతాపుడిని చూస్తూనే, “ఏం నాయనా, అలా విచారంగా వున్నావు?” అని అడిగాడు నవ్వుతూ.
ప్రతాపుడు తన పరిస్థితి చెప్పుకుని, “మీ భక్తుడు గోవిందం ఒకప్పుడు, మా ఊరివాడే. ఆయన తండ్రి అతడికి లక్షల ఆస్తిపాస్తులు ఇచ్చాడు. మా నాన్న నాకు ఇచ్చింది ఏపాటి! నాకు నా జీవితం మీద రోతపుడుతున్నది” అన్నాడు ఆవేశంగా.

ఋషీశ్వరుడు చిన్నగా నవ్వి

ఋషీశ్వరుడు చిన్నగా నవ్వి “జీవితంలో హెచ్చుతగ్గులు సహజం. కాలప్రవాహంలో మార్పులు అనివార్యం. అయినా, మీ నాన్నగారు ఇచ్చిన తరగని ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అది నీ ఆరోగ్యం! నువ్వు కష్టపడతావు; కడుపునిండా తింటావు. ఇంట్లో అందరూ నిన్ను అభిమానిస్తారు. దానికి మించిన భాగ్యం లేదు. అయినా నీలో ఈ అసంతృప్తి నీ మిత్రుణ్ణి చూశాకే గదా కలిగింది? అంతకుముందు సుఖంగానే వున్నావు. నిజానికి అతణ్ణి గురించి తెలుసుకుంటే, నీలో అసూయ కారణంగా కలిగిన అసంతృప్తి కలిగేదికాదు.” అన్నాడు.

గోవిందం భోగభాగ్యాలతో హాయిగా వున్నాడు. అతడికేం కొరత?” అని అడిగాడు ప్రతాపుడు.
ఋషీశ్వరుడు ఒక క్షణం ఆగి, “కావాలంటే నిన్ను క్షణాలలో కోటీశ్వరుణ్ణి చేయగలను. ప్రశాంతమైన
” “అయితే విను! గోవిందంలో ఐశ్వర్యం తెచ్చే అన్ని వ్యాధులూ, ఈ వయసుకే తిష్ట వేశాయి. కోట్లువుండి ఏం లాభం! తీపి తినాలంటే చక్కెర వ్యాధి, ఉప్పు తినాలంటే రక్తపోటు, నాలుగడుగులు వేయనీకుండా ఆయాసం. వీటికితోడు వ్యాపారంలో తట్టుకోలేని పోటీ నిద్రలేకుండా చేస్తోంది. మందుల కోసం, మనశ్శాంతి కోసం తరచూ ఇక్కడికి వస్తూంటాడు” అన్నాడు ఋషీశ్వరుడు. “అలాగా!” అంటూ ఆశ్చర్యపోయాడు ప్రతాపుడుఇప్పటి జీవితమే చాలో, మనశ్శాంతి లేని కోటీశ్వరుడి జీవితం కావాలో, నువ్వే నిర్ణయించుకో” అంటూ ప్రతాపుడి తలమీద చేయిపెట్టాడు. ఆ వెంటనే ప్రతాపుడి కళ్ళు మూతలుపడినై.

ప్రతాపుడు బ్రహ్మాండమైన భవనంలో హంసతూలికా తల్పం మీద పడుకునివున్నాడు. ఇంటినిండా సేవకులు, ఎదుట పళ్ళూ, పంచభక్ష్య పరమాన్నాలూ అయినా, ప్రతాపుడు ఆయాసంతో లేవలేకపోయాడు. సేవకులను గట్టిగా పిలవడం కూడా సాధ్యపడలేదు. అతి ప్రయత్నం మీదలేచి కూర్చుని, నేలమీద కాలుమోపి ముందుకు అడుగువేయబోయి కళ్ళుతిరిగి పడిపోయాడు. అలా పడిపోయినవాడు భార్యనూ, తల్లినీ పిలిస్తే వాళ్ళు, సేవకులను పిలవసాగారు. ఆ వెంటనే ప్రతాపుడు “వద్దు! వద్దు! నాకీ జీవితం వద్దు!” అని అరుస్తూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఋషీశ్వరుడు మందహాసం చేస్తూ, అతడికి కనిపించాడు.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

“నాకళ్ళు తెరిపించారు, స్వామీ! కోటీశ్వరుడి బాధలు నాకు వద్దు. నన్ను కంటికి రెప్పలా చూసుకునే భార్య, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, నామీదే ప్రాణాలు పెట్టుకుని బతికే తల్లి, నాకేంలోటు?” అన్నాడు ప్రతాపుడు.
“సంతోషం, నాయనా! తృప్తి, ఆరోగ్యం, ఆనందం – ఇవి మనిషికి చాలా ముఖ్యం. అవి వుంటే కోట్ల రూపాయలతో పనిలేదు. మరొక సంగతి; మనిషికి అసూయ శాపం వంటిది. నీ మిత్రుడు గోవిందంను చూశాకే అది నీలో తలెత్తింది. అసంతృప్తికిలోనయ్యావు. ఇప్పుడది తొలగిపోయింది. ఇక నీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది, వెళ్ళిరా!” అని ఆశీర్వదించాడు ఋషీశ్వరుడు. ప్రతాపుడు, ఋషీశ్వరుడి పాదాలకు నమస్కరించి, సంతోషంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top