దర్గాలో ప్రత్యేక ఫాతేహాలు సమర్పించిన MLA కాటసాని

Darga lo pujalu MLA KATASANI RAMIREDDY

Darga lo pujalu MLA KATASANI RAMIREDDY

నంద్యాల జిల్లా
బనగానపల్లె నియోజకవర్గం
ఆలూరు నియోజకవర్గం దేవర గట్టు గ్రామం అంగార్ వలి సాహెబ్ దర్గా ను సందర్శించి ప్రత్యేక ఫాతేహాలు సమర్పించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు…..

పాల్గొన్న జెండే వాలే సాహెబ్ సయ్యద్ అబ్దాల్ హుస్సేన్ సాహెబ్ ఖాద్రీ,కాటసాని తిరుపాల్ రెడ్డి,సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి,జిల్లెళ్ళ శంకర్ రెడ్డి,అంబటి రవి, సైకిల్ షాప్ మహబూబ్ వలి,గాజుల వలి,ఇంజనీర్ గౌస్,బనగానపల్లె పట్టణ ముస్లిం సోదరులు ……

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవర గట్టు గ్రామం లోని ఆంగార్ వలి సాహెబ్ దర్గాను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సందర్శించి ప్రత్యేక ఫాతేహాలు సమర్పించారు .

బనగానపల్లె పట్టణం వైయస్సార్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకుడు కలాం దేవర గట్టు అంగార్ వలి సాహెబ్ దర్గాలో మొక్కుబడి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు హాజరు అయ్యారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

ఈ కార్యక్రమంలో జేండే వాలే సాహెబ్ సయ్యద్ అబ్ధాల్ హుస్సేన్ సాహెబ్ ఖాద్రీ , కాటసాని తిరు పాల్ రెడ్డి, సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి, జిల్లెళ్ల శంకర్ రెడ్డి,అంబటి రవి రెడ్డి, సైకిల్ షాప్ మహబూబ్ వలి,ఇంజనీర్ గౌస్,గాజుల వలి,ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.

దర్గాల చరిత్ర

మహమ్మదు ప్రవక్త మనవడు హిమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా ముస్లింలు మొహర్రం పండుగ జరుకుంటారు

అప్పటి దుర్మార్గ యజీద్ చక్రవర్తి దురాగతాలు దౌర్జన్యాలపై ఇమామ్ హుస్సేన్ ఎదురొడ్డి పోరాడారు.

శాంతియుత సమసమాజ స్థాపన కోసం కర్బలా మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం చేసి త్యాగనిరతికి మారుపేరు అయ్యాడు.

పవిత్ర పోరులో అమరులైన ఇమామ్ హుస్సేన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ పదిరోజులపాటు నివాళులర్పిస్తారు.

మొహరం ఉత్సవాలను కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో సవార్లను అనగా పీర్లను మొక్కుతారు కోరిన కోరికలు తీర్చే మహత్యం పీర్లకు ఉందని నమ్ముతారు.

భువికి ధైవ సందేశాన్ని తీసుకువచ్చిన మహమ్మద్ ప్రవక్త సమాజంలో ఉన్న అన్యాయాలను అక్రమాలను నిలధీశాడు ప్రజారంజక పాలనను ఆకాంక్షించాడు.

జనమంతా సుఖసంతోషాలతో జీవించాలని అభిలషించాడు మహమ్మద్ ప్రవక్త మరణానంతరం పాలన సారించిన హజరత్ హబూబ్ హతక్ ,

హజరత్ అలీ,హజరత్ ఉమర్లు సైతం మంచి పాలన అందించి ప్రజల మన్నలను పొందారు.

ఐతే ఆతర్వాత వచ్చిన మావియా అనే చక్రవర్తి ప్రజలను పీక్కు తినడం మొదలు పెట్టాడు అతడి వారసుడిగా వచ్చిన యజీద్ ఏకంగా రాక్షస పాలన కొనసాగించాడు.

చెడు అలవాట్లకు బానిసైనా రాజు ప్రజలను వేధిస్తుంటే హిమామ్ హుస్సేన్ ఎదురు తిరిగారు ప్రజలంతా హుస్సేన్ పక్షాన నిలిచారు.

ఖర్బాలా మైదానంలో సమరం ప్రారంభం

శాంతి మార్గమే శ్రేయస్కరమనీ హుస్సేన్ చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చిన రాజు యుద్ధం ప్రకటించించారు.

మొహర్రం నెల ఒకటవ తేదీనా ఖర్బాలా మైదానంలో సమరం ప్రారంభం అవుతుంది ఎజీద్ సైన్యం వందల మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటుంది

హుస్సేన్ కుటుంభీకులను రోజుకొకరిని శత్రుసైన్యం పాశవికంగా హతమారుస్తుంది.

Also Read ..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

మొహర్రం నెల పదవరోజున యజీద్ సేనలు రెచ్చిపోతాయి అయినప్పటికీ వెనకడుగు వేయకుండా హుస్సేన్ అనుచరులు వీరోచితంగా పోరాటం సాగిస్తూనే ఉంటారు.

సాయం సంధ్య వేళ నమాజ్ చేస్తున్న హిమామ్ హుస్సేన్ను శత్రు సైన్యం చుట్టుముడుతుంది ప్రార్థనలో భాగంగా భూమి పై తల ఆనించిన వెంటనే శిరస్సును చేధిస్తుంది.

హిమామ్ హుస్సేన్ తలతో శత్రు సైన్యం ఊరేగుతూ విజయోత్సాహం జరుపుకుంటుంటుది. హిమామ్ హుస్సేన్ భలి ధానంతో పాటు సమసమాజ స్థాపన కోసం..

ప్రాణత్యాగం చేసిన ఆయన కుటుంబ సభ్యులను ప్రజలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top