- ఆత్మకూరు ప్రమాద ఘటనలో 5 కు చేరిన మృతుల సంఖ్య
- కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్ (14) అనే బాలుడు మృతి
- ఇంకా హాస్పటల్లో చికిత్స పొందుతున్న 13 మంది క్షతగాత్రులు
- శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఉండగా ఆత్మకూరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదం. మృతులంతా ఆదోని వాసులు
- ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి.
- బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్
నల్లమల ఆటవీ ప్రాంతంలోని కర్నూలు గుంటూరు రహదారి రక్తసిక్తమైంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్దాపురం చెరువు సమీ పంలో శుక్రవారం బొలేరో ట్రక్ (ఏపీ39 క్యూవీ 7276) అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో నలు గురు అక్కడికక్కడే మరణించగా, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు, క్షతగాత్రుల రోదనలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని రాచోటి సుబ్బయ్య నగర్ కాలనీ, ఇం దిరా నగర్, రాజీవ్ నగర్ లలో నివాసం ఉంటున్న ఐదు సమీప కుటుంబాల వారు 23 మంది బొలెరో వాహనంలో శ్రీశైలానికి దర్శనార్థం వెళ్లారు. తమ పిల్లలు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారనే సంతోషం లో శ్రీశైలానికి వెళ్లి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసు కున్నారు. శుక్రవారం తిరిగి వస్తుండగా సిద్దాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వడం కోసం రోడ్డు దిగింది. అయితే ముందు రోజు వర్షం పడడం వల్ల రోడ్డు పక్కన బురద ఉండటంతో టైరు జారిపోయి వాహనం అదుపు తప్పింది. దీంతో వాహనంలో ఉన్న వారంతా చెల్లా చెదురుగా పడిపోయారు.
ఈ ఘటనలో చంద్రమ్మ (31), గిడ్డయ్య (42), శశికళ (40), లక్ష్మి (28) అక్క డికక్కడే మరణించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్ (14) అనే బాలుడు మృతి చెందాడు. శశికళ, లక్ష్మిలు తోడికోడళ్లు (అన్నదమ్ముల భార్యలు). గిడ్డయ్య వీరికి బాబాయి వరుస అవుతారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని సమీప సంజీవనగర్ తండా వాసులు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభు త్వాసుపత్రికి తరలించారు. ఆత్మకూరు సీఐ రాము ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతను పెంచిన చెక్క బల్ల బొలెరో ట్రక్ వెనుక భాగంలో కొందరు కింద కూర్చోగా.. వారిపై భాగంలో ఓ చెక్క బల్లను ఏర్పాటు చేసి, మరికొందరు కూర్చున్నారు. ఇలా కూర్చోవడమే ప్రమాద తీవ్రతను పెంచినట్లుగా తెలుస్తోంది. వాహనం బోల్తా పడిన వెంటనే బల్లపై కూర్చున్న వాళ్లు కింద పడటం, వాహనం వారి మీదుగా పల్టీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. దీనికి తోడు ఘటన జరిగిన సమయంలో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికే వర్షం కురవడంతో రోడ్డంతా తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో వేగంగా వస్తున్న బొలెరో వాహనం సింగిల్ రోడ్డులో సైడ్ దిగి అదుపు తప్పింది.
తీవ్రంగా గాయపడింది వీరే..
ప్రమాదంలో సరస్వతి. అచ్చన్న, కీర్తి, ప్రవీణ్ తేజ్, రవిరాజు, రంగస్వామి, గిరిధర్, కుమార్, హరి, గోపిచంద్, శిలాప, వీరేష్, హర్ష, ఒబీనాలు తీవ్రం గా గాయపడ్డారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఇద్దరు బాలురు చిన్న గాయం కూడా లేకుండా ప్రమాదం నుంచి బయట పడటం ఆశ్చర్యం కలిగించింది.