- ప్రాచీన కాలంలో..
నల్లమల అటవీ ప్రాంతంలో ఒకప్పుడు ఏనుగులు సంచరిం చాయనడానికి కొన్ని ఆనవాళ్లు ప్రాచీన చరిత్ర భద్ర పరిచింది.
ప్రస్తుతం నల్లమలలోని నంద్యాల జిల్లా ఆత్మ కూరు అటవీ డివిజన్ పరిధిలో ఉన్న కరివేన గ్రామం ఉన్న ప్రాంతాన్ని
ప్రాచీన కాలంలో కరివనంగా పిలిచేవారని గ్రామానికి చెందిన పండితులు చెబుతున్నారు.
కరి అంటే సంస్కృతం లో ఏనుగనే అర్థం. ఏనుగులు సంచరించే ప్రాంతం కావడంతో దీన్ని కరివనంగా పిలిచే వారట. ఇక్కడికి సమీపంలో ఉన్న
నల్లకాల్వ గ్రామానికి కూడా ఈ చరిత్రలో చోటుంది. నల్లకాల్వ గ్రామం పూర్వ నామం నల్ల కలువ. ఒకప్పటి దట్ట మైన ఆరణ్య మైన
ఈ ప్రాంతంలో ఉన్న కొలనులో నల్ల కలువలు ఉండేవట.కరివనం లో ఉండే ఏనుగులు నల్లకాల్వ ప్రాంతంలో ఉన్న కొలనులోని కలువలను ఆహారంగా
స్వీకరించేందుకు వచ్చేవని గ్రామ చరిత్ర వల్ల తెలుస్తోంది.. ఈ ఆధారాల కారణంగా నల్లమలలో ఏనుగుల సంచారం ఉండేదని సష్టమవుతుంది.
- బ్రిటీష్ పాలనలో..
నల్లమలలో విలువైన కలప తరలించేందుకు బ్రిటీష్ పాలకులు విరివిగా ఏనుగులను వినియో గించినట్లు అటవీ శాఖ పని విధానంలో తెలుస్తోంది.
నల్లమలలోని పెచ్చెర్వు, గుండ్ల బ్రహ్మేశ్వరం. వంటి ఎత్తైన అటవీ ప్రాంతాల్లో విస్తారంగా టేకు, నల్లమద్ది, జిట్టేగి, ఏగి తదితర మహావృక్షాలు ఉండేవి.
వీటిని బ్రిటీష్ అధికారులు నరికించి మైదాన ప్రాంతానికి తరలించేందుకు ఏనుగులను విని యోగించే వారు. వీటిని నడిపించేందుకు స్థానికంగానే మావటీలను
Also Read నల్లమల అడవులకు గజరాజులు
కూడా ఏర్పాటు చేసుకునేవారు. ఆత్మకూరు పట్టణంలో ఇప్పటికి హత్తి (హాథీ)వాలే అనే వంశం ఉంది. ఈ వంశంలోని పలు కుటుం బాలను ఇప్పటికి ఈ పేరుతోనే పిలుస్తుంటారు.
ఈ వంశానికి చెందిన వారు ఏనుగులను నడిపిం చేందుకు, వాటికి హారం, నీరు అందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందే వారట. కాలక్రమేణ వచ్చిన మార్పులతో రవాణా పద్ధతులు మారడం తో క్రమేపి ఏనుగులు నల్లమలను వీడాయి. వాటిని పోషించిన వారికి మాత్రం ఏనుగులు ఇం టిపేరుగా (హాథీవాలే) నిలిచి పోయింది.
ఏనుగుల కోట..
నల్లమలలో ఏనుగులు సంచరించా యనడానికి ఇప్పటికీ ఆత్మకూరు అటవీ డివిజన్లోని అరణ్యంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నల్లకాల్వ గ్రామం నుంచి రుద్రకోడు వెళ్లే మార్గంలో ఏను గుల కోట అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఏనుగులు అధికంగా సంచరించడం వల్ల ఆ ప్రాంతాన్ని ఏనుగుల కోటగా పిలిచే వారని పెద్దలు చెబుతుంటారు.
- వెలుగోడు రేంజ్లో గుండ్లబ్రహ్మేశ్వరం
వెలుగోడు రేంజ్లో గుండ్లబ్రహ్మేశ్వరం సమీపం లో దంతాల తిప్ప అనే కొండ ఉంది. ఇది ఏనుగుల దంతాల కారణంగానే చరిత్రలో ఒక కొండ గుర్తుగా మిగిలింది. ఈ కొండ దిగువన ఉన్న ఒక గుహ వద్ద ఏదైనా అలికిడి అయితే అది కొండమీద ప్రతిధ్వనించేదట. కొండ మీద ఉండే నీటి దొరువు వద్దకు దప్పిక తీర్చుకునేం దుకు వచ్చే ఏనుగులు ఈ ధ్వని హెచ్చరికతో జన సంచారాన్ని గుర్తించి దూరం వెళ్లేవని చెబు తుంటారు.