BSNL టవర్లు – MP బైరెడ్డి శబరి

BSNL TOWERS MP BYREDD SABARI

BSNL TOWERS MP BYREDD SABARI

  • గ్రామీణ ప్రాంతాలకు 4 జి నెట్ వర్క్ 6 బిఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు చేయించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

గ్రామీణ ప్రాంతాలకు సెల్ టవర్ సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 4 జి నెట్ వర్క్ బి ఎస్ ఎన్ ఎల్ కొత్త 6 టవర్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మంజూరు చేయించారు.

శనివారం నందికొట్కూరులోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టెలికామ్ సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, మాజీ జడ్ పి టీ సి నాగేశ్వరావులు మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక కృషితో 6 బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు మంజూరు అయ్యాయని తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సహకారంతో ఆత్మకూరు డివిజన్ పరిధిలో 6 బిఎస్ఎన్ఎల్ 4 జి టవర్లు మంజూరు అయినట్లు వివరించారు. నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాలలో ఎన్నికల సమయంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు సరైన నెట్వర్క్ టవర్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారని, నేను ఎంపీ గా గెలిచిన వెంటనే మీ సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇవ్వడం, వాటిని మంజూరు కూడా చేయించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి మా గ్రామాల ప్రజల తరుపున ధన్యవాదములు తెలియజేస్తున్నామని కురువ రమేష్, నాగేశ్వరావులు చెప్పారు. బి ఎస్ ఎన్ ఎల్ 4 జి నెట్ వర్క్ 6 టవర్లు గ్రామీణ ప్రాంతాలకు మంజూరు కావడం ఆనందం గా ఉందన్నారు

మిడుతూరు మండలంలోని దేవనూరు గ్రామంలో 1 , రోళ్ళపాడు గ్రామంలో 1, జలకనూరు గ్రామంలో 1, కొత్తపల్లి మండలంలోని ఎర్రమఠం గ్రామంలో 1, అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో 2 టవర్లు మంజూరు అయ్యాయని వారు వివరించారు. ఈ టవర్ల నిర్మాణం 6, 7 నెలలలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చేయించారన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top