మీ..నాలుగు గ్రామాల ప్రజలకు అండగా ఉంటా .. ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ భరోసా
- నేను మీ అధికారిని..
- మీ శ్రేయస్సు కోసం పనిచేస్తా..
- టెంటు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు
- మీకోసం జెసి గారితో చర్చించా..
- రెండు మూడు రోజుల్లోనే PD & JC గారితో..మీ ముందుకు వస్తా..
- శాంతియుతంగా సాధించుకోండి
- అధర్యపడొద్దు…నేనున్నా..
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని నాలుగు గ్రామాలకు రాక పోకలకు అంతరాయం కలిగిస్తున్న నేషనల్ హైవే పై అండర్ పాస్ బ్రిడ్జి నిర్వహించాలని పది రోజులుగా .. ముష్టపల్లె , సిద్దపల్లె , పెద్దానంతపురం , డైరీ కొట్టాల గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు .
అండర్ పాస్ బ్రిడ్జి కావాలని నేషనల్ హైవే 340’C రహదారి పనులపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముష్టపల్లె , సిద్ధపల్లె , పెద్ద అనంతాపురం , డైరీ కొట్టాల గ్రామస్తులతో ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ ఆదివారం నాడు తన కార్యాలయంలో సమావేశమయ్యారు..
మీ గ్రామాల తరపున తన వంతుగా జాయింట్ కలెక్టర్ తో మాట్లాడాలని అన్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే జెసి గారు..అలాగే నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ (PD) గారు.సమస్య ఉన్న సిద్దపల్లే రస్తాకు తనతో సహా వస్తామని అన్నారు.
అందరూ గౌరవప్రదంగా వారితో మాట్లాడి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించుటకు శాంతియుతంగా.. వ్యవహరించాలని అన్నారు.
ధర్నాలు , నిరాహార దీక్షలు..చేస్తేనే అండర్ పాస్ బ్రిడ్జి వస్తుందన్న అపోహలు పక్కనపెట్టి.. శాంతియుతంగా..సాధించుకోవాలని.. నాలుగు గ్రామాల ప్రజలకు తెలిపారు.