- కలుషితనీరు త్రాగి గందరగోళంలో కాలనీ ప్రజలు
- ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనే విషయంతోనే సర్దుబాటు
- మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రజా సంఘాల డిమాండ్
- ఏదైన ప్రమాదం జరిగిన్నప్పుడే.. హడావిడి చేసే అధికార యంత్రాంగం
ప్రజల ప్రాణాలు పోయిన ప్రభుత్వాల తీరు మారడం లేదు. కలుషితం నీరు త్రాగి గందరగోళంలో కాలనీ ప్రజలు ఉంటే ప్రజల దగ్గరకు వచ్చి భరోసా కల్పించాల్సిన జిల్లా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం నామకువాస్తిగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కలుషితనీరు త్రాగలేదని ప్రకటనలు చేసి వెళ్లారు. పూర్తి విషయాలు కాలనీలో తిరుగుతే అధికారులకు అర్థం అయ్యేది. పురపాలక సంఘంలో డ్రైనేజి కాల్వలో పాతపైప్పులైనులు అధిక లీకేజి ఉండడంతో నీరు కలుషితం అయి దుర్వాషన వస్తుందని ప్రజలు చెప్పిన అధికారులు మాత్రం ఆ మాటలను అధికారులు తిప్పికొటేశారు.
కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనా..లేక ప్రజల ప్రాణాలు పోయిన పర్వలేదు. అనుకుంటే దానికి ఎవరు ఏమి చేయలేరు. ఒకవైపు ప్రజా సంఘాల నాయకులు మృతి చెందిన ఇద్దరి కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు జరిగిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అధికార యంత్రాంగం కలుషిత నీరు త్రాగలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆత్మకూరు పురపాలక సంఘంలో గత పది రోజుల నుంచి డ్రైనేజి కాల్వలో పైపు లైన్లు లీకేజీ కావడంతో నీళ్ళు దుర్వాసన వస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ముఖంపైన కాలనీ వాసులు చెప్పడం జరిగింది.
కేవలం పారిశుద్ధ్య పనులు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అంత హడవీడి చేయడం విడ్డూరంగా ఉంది. 24 వార్డుల పరిధిలో ఏదైన జరగరాని సంఘటన జరిగితే తప్పా ప్రజలపై కపటప్రేమ చూపిస్తూ చేతులు దులుపుకోని వెళ్లే అధికారుల తీరుపై పట్టణ ప్రజలు ప్రజా సంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఇంటింటికి వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెరుగైన సేవలు అందిస్తామంటూ ప్రజలకు భరోసా కల్పించుకుంటూ వెళ్తూన్నారు.. ఏది ఏమైన్నప్పటికి ప్రజల ప్రాణాలు పోతున్నప్పటికి కాలనీ ప్రజలను పరామార్శించే కన్నుచూపు మేర అధికారులు కనిపించలేదు. కేవలం విధి నిర్వహణలో వచ్చామా వెళ్లామా సమస్య పరిష్కారం జరిగిందా లేదా అనే విషయాలపై దృష్టి పెట్టడం గమనార్హం.