ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి సరికాదు

Amaravati is not suitable as the capital of Andhra Pradesh.

Amaravati is not suitable as the capital of Andhra Pradesh.

రాజమండ్రి ..


భారతదేశానికి రాజధాని మార్పు అవసరం అని బావించాలి ..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి సరికాదు. ఎప్పటికి సాధ్యం కాదు .

మేధావుల మౌనం దేశ భద్రతకు , రాష్ట్రా భవిష్యత్ కు పెను ప్రమాదం కానుంది .

భారతదేశ భద్రతను సంస్కరించుకోవాలి . సంపదను అన్ని వర్గాల దరికి చేర్చాలి ..


మేడా శ్రీనివాస్ , సూచన ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..


హైదరాబాద్ ను దేశ రాజధానిగా పరిశీలన చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు ..

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా దేశ భద్రత దృష్ట్యా రాజధాన్ని సంస్కరించు కోవాల్సిన అవసరం వున్నట్టుగా మేధావులు గుర్తించాలి. భారతదేశానికి ఢిల్లీ రాజధాని ఎంత మేరకు సురక్షితం . రాజధానిగా ఢిల్లీ విపరీతమైన కాలుష్యంతో విష నగరంగా మారిపోయింది . ఢిల్లీ నలుమూలల అసాంఘిక శక్తులకు పూర్తి స్థాయి పట్టు ఏర్పడి వున్నది . ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కొరల్లో చిక్కుకున్న నగరంగా ఢిల్లీ చెడు ఖ్యాతిని దక్కించుకుంది . ఢిల్లీ మహా నగరం సుదూర ప్రాంతాల వరకు తీవ్రమైన కాలుష్యం ఇమిడి వుంది . ప్రజల ఆరోగ్యాలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది . శత్రు దేశానికి సరిహద్దుగా పటిష్టమైన కట్టు దిట్టమైన భద్రత ఉండటం శాస్త్రీయ పరంగా మంచిది .

పరిపాలనా విభాగం మొత్తం భారత్ కు అటు ఇటు భాగంలో ఉండటం శ్రేయస్సు కారం అని , భారతదేశానికి శాస్త్రీయతగాను , బౌగోళికంగాను, వాస్తు రిత్యా కూడా ఢిల్లీ ఖచ్చితమైన ప్రాంతం కాదని గుర్తించాలి . 75 ఏళ్లుగా భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని , గుప్తులు కాలం నాటి పరిస్థితులనే ఇంకను సరిపెట్టుకుంటు అభివృద్ధి అనుకోవటం మంచి పరిణామం కాదని , మేధావుల గనిగా పేరు గాంచిన భారతదేశ మేధస్సు ప్రక్కదారి పడుతుందని బావించాలి . నేడు ఢిల్లీ నలుమూలల వున్నటు వంటి అతి విలువైన భద్రతా సమాచారం పై శత్రు మూఖలు బాగా పట్టు బిగించాయని , దేశ రాజధాన్ని ప్రస్తుత పరిస్థితులుకు అనువుగా పూర్తి స్థాయి శత్రు దుర్బెద్యంగా హైదరాబాద్ వంటి మహానగరంను అంచె లంచెలుగా అభివృద్ధి చేసుకోవటం భారత్ కు ఎంతైనా అవసరం వుంది . హైదరాబాద్ ను భారతదేశ రాజధానిగా పరిశీలన జరుపగలిగితే హైదరాబాద్ నుండి ఖమ్మం వరకు కొత్త కొత్త విధానాలతో భద్రతా ప్రమాణాలను అభివృద్ధి చేయవచ్చును . భారత్ కు ఢిల్లీ రాజధానిగా కాలం చెల్లింది . దేశ భద్రత దృష్ట్యా కొత్తగా అదునాతన పద్ధతుల్లో భారతదేశానికి ఒక కొత్త రాజధాన్ని నిర్మించుకోవాల్సిన గురుతర భాద్యత ఆసన్నమైనదని నేటి పాలకులు గుర్తించి ఆచరణలో పెట్టాలని , పాత పార్లమెంట్ భవనాన్ని మర్చి కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన దిశగా కొత్త రాజధాని అవసరాన్ని భారతదేశ భవిష్యత్ దృష్ట్యా ఆలోచన చేయాలని ఆయన సూచించారు ..

ఆంధ్రప్రదేశ్ లో కలుషిత రాజకీయాలకు ఉన్న ప్రాదాన్యత రాష్ట్ర అభివృద్ధి , భవిష్యత్ పై ప్రస్తుత కార్పొరేట్ రాజకీయ పార్టిలు ద్రుష్టి చూపటం లేదు అనేది పచ్చి నిజం . రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు పూర్తి కావొస్తున్నా నేటికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు . రాజధానిగా అమరావతికి ఎటువంటి చట్ట బద్దత ప్రస్తుతానికి లేదు . అయినా అమరావతి రాజధాని పేరు పై నేటికి సుమారు 15 వేల కోట్లు పై భడి వృధా ఖర్చు చేసారు . ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా సరికాదు అని ప్రపంచ బ్యాంక్ , నాసా వంటి ఉన్నత సంస్థలు పేర్కొన్నా ఆంధ్ర రాష్ట్ర పాలకులు మాత్రం అమరావతే రాజధాని అంటు ఆంధ్రులను మోసం చేస్తు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు . అమరావతిని కాదన్న వారిని కొన్ని సొంత కార్పొరేట్ మీడియా సంస్థల ద్వారా ప్రశ్నిస్తున్న వారిని దుమ్మేత్తి పోస్తు ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు .

ఆంధ్రప్రదేశ్ కు ప్రతి ఆంధ్రుడు ఒక గొప్ప రాజధాని కావాలి అని కోరుకుంటున్నారు తప్ప ఇక్కడే కావాలి అని ఏ ఆంధ్రుడు కోరటం లేదు . కార్పొరేట్ పాలకులే ప్రాంతాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు . కనీస జ్ఞానం వున్న మేధావులు ఎవరైనా ఏ తీరు తిన్ను లేని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి పచ్చటి పొలాలను , వ్యవసాయాన్ని , పర్యావరణాన్ని పాడుచేస్తారా ! ముందుగా కొంతమేర అభివృద్ధి చెంది వున్న గుంటూరు నగరాన్ని రాజధానిగా ఎంపిక చేస్తారా ! అని ఆలోచించండి . అమరావతికి విపత్తులతో సమస్యలు ఉన్నాయానేది జగమెరిగిన సత్యం. ఈ వాస్తవాన్ని గుంటూరు మేధావి వర్గం గుర్తించి గుంటూరు ను రాజధానిగా అడగక పోవటం బాదాకారం . ఆంధ్రప్రదేశ్ కు ఒక మంచి అద్భుతమైన రాజధాని కావాలి అంటు ఈ తరం ప్రజలకు భవిష్యత్ ఆశ అని , అందుకు సరైన ప్రాంతం గుంటూరు మాత్రమే నని , ఆ తరువాత అన్ని సహజవనరులు పుష్కలంగా ఉన్నటువంటి రాజమంద్రి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు..

ఆంధ్రప్రదేశ్ ను ఢిల్లీ పెద్దల రాజకీయ అవసరాలకు ఒక ముడి సరుకు వలే రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని , ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోదీకి భయపడుతూ గులాం గిరి చేస్తున్నారని , ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మేధావులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారాని , నేడు అంతకు మించిన మేధావులు ఉన్నప్పటికి భయం , బలహీనతలతో మోనం వహిస్తు రాష్ట్ర ప్రయోజనాలకు , భవిష్యత్ కు శాప గ్రస్తులుగా మారిపోయి ఉండి లేనట్టుగా బ్రతికేస్తున్నారు . మన మేధావుల మౌనం తీవ్రవాదం కన్నా ప్రమాదం అని , మన భారతదేశంలో యుద్ధ ప్రాతిప్రదికన సంస్కరించు కోవాల్సిన అత్యవసర పరిస్థితులు మన ముందు వున్నాయని , సంపదను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే విధంగా పాలనా సంస్కరణలకు నడుం బిగించాలని , భారతదేశం యొక్క కొత్త రాజధాని మార్పు , అందుకు అనువైన ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి ఉందనే నిజాన్ని దేశ వ్యాప్తంగా గుర్తించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు ..

సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్స్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .

ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా, మోర్త ప్రభాకర్ , మేడిచర్ల శ్రీనివాసరావు , వాడపల్లి జ్యోతిష్ , సుంకర వెంకట భాస్కర రంగారావు , వాకాటి అచ్యుతరావు , చల్లా సాంబశివరావు ,
ఎస్ కె సైఫుల్లా, అడపా దేవుడు , కొట్టేటి సత్యనారాయణ, చల్లా వంశీ , చల్లా అఖిల్ , మేమిదాసు చిన తల్లి , మాసా అప్పాయమ్మ ఏమిదాసు శాంతి, రెడ్డి స్వర్ణలత, రెడ్డి భవ్య శ్రీ , కోట సుశీల తదితరులు పాల్గొనియున్నారు ..

–మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top