ముష్టపల్లె గ్రామంలో..శ్రీ కోదండరాముల వారి కళ్యాణం

Mustepalle lo seeta Ramula kalyanam

Mustepalle lo seeta Ramula kalyanam

ముష్టపల్లె గ్రామంలో ఘనంగా..శ్రీ కోదండరాముల వారి కళ్యాణం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టెపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో.. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని..సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

ఆత్మకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు అత్తులూరి వారి కుటుంబ సభ్యులు.. పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు.. ప్రతి శ్రీరామనవమికి జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవంలో వారి కుటుంబ సభ్యులే పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ కార్యక్రమాని అత్తులూరి శివరాం దంపతులు , అత్తులూరి సాయికిరణ్ దంపతులు , తదితర వారి బంధు వర్గీలు ముష్టపల్లెకు చేరుకోగానే భాజా భజంత్రీలతో గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు.

వారికి శాలువాకప్పి పూల మాల వేసి పూర్ణకుంభ స్వాగతంతో వారికి సాదరంగా గ్రామస్తులు ఆహ్వానించారు.

పూర్వనుండి వస్తున్న ఆచారాల ప్రకారం , పుట్టమట్టి , కుమ్మరి కుండలు, పెళ్లి పీటలు తీసుకొచ్చి.. కళ్యాణ మండపంలో బియ్యంతో పోలు.. నిర్వహించడం వంటి సాంప్రదాయపరమైన కార్యక్రమాలన్ని నిర్వహించారు.

ఈ కళ్యాణ మహోత్సవంలో ఐదు జంటలు పాల్గొన్నాయి.. సీతా , రాములకు జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు వంటి క్రతువులను ఎంతో బక్తి శ్రద్దలతో నిర్వహించారు.

కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన అనంతరం.. సదివింపులు పెట్టి గ్రామస్తులంతా ఆలయం దగ్గరే విందు భోజనం చేశారు.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

#Mustepalle lo seeta Ramula kalyanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top