ముష్టపల్లె గ్రామంలో ఘనంగా..శ్రీ కోదండరాముల వారి కళ్యాణం
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టెపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో.. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని..సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.
ఆత్మకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు అత్తులూరి వారి కుటుంబ సభ్యులు.. పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు.. ప్రతి శ్రీరామనవమికి జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవంలో వారి కుటుంబ సభ్యులే పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ కార్యక్రమాని అత్తులూరి శివరాం దంపతులు , అత్తులూరి సాయికిరణ్ దంపతులు , తదితర వారి బంధు వర్గీలు ముష్టపల్లెకు చేరుకోగానే భాజా భజంత్రీలతో గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు.
వారికి శాలువాకప్పి పూల మాల వేసి పూర్ణకుంభ స్వాగతంతో వారికి సాదరంగా గ్రామస్తులు ఆహ్వానించారు.
పూర్వనుండి వస్తున్న ఆచారాల ప్రకారం , పుట్టమట్టి , కుమ్మరి కుండలు, పెళ్లి పీటలు తీసుకొచ్చి.. కళ్యాణ మండపంలో బియ్యంతో పోలు.. నిర్వహించడం వంటి సాంప్రదాయపరమైన కార్యక్రమాలన్ని నిర్వహించారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో ఐదు జంటలు పాల్గొన్నాయి.. సీతా , రాములకు జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు వంటి క్రతువులను ఎంతో బక్తి శ్రద్దలతో నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన అనంతరం.. సదివింపులు పెట్టి గ్రామస్తులంతా ఆలయం దగ్గరే విందు భోజనం చేశారు.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

#Mustepalle lo seeta Ramula kalyanam