నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించాక ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు ..
జగన్ మోహన్ రెడ్డి వాఖ్యలపై మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తీవ్రంగా విరుచుక పడ్డాడు ..
ఆనంతపురం : ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాసనసభ్యుడు జగన్ ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని.. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మండిపడ్డారు
30 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డికి.. 14 కేసులు ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తే..
నా తోటి శాసన సభ్యుడు జగన్మోహన్ రెడ్డి కు ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయమనీ .. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి సంపించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నట్టోరియల్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్య పోల్చినటువంటి అంశం ఏమీ కాదని ..
Plz Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1
చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుడిని నడు రోడ్డు మీద గొడ్డలితో నరికించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గం లో జరుగుతున్న నరమేధం 14 కేసులు ఉన్నటువంటి నర హంతకుడు భూక బ్జాదారుడు ప్రజలను పీల్చి పిప్పి చేసినటువంటి నట్టోరియల్ క్రిమినల్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు మంచి వ్యక్తిగా కనిపించడం బహుశా 30 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డికి 14 కేసులు ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించవచ్చునని అన్నారు.
నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని నిజంగా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేసి ఉంటే రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుడిని మాచర్ల పట్టణంలో పోలీసులు బట్టలు ఊడదీసి కొట్టి ఊరేగించి అరెస్టు చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని మండిపడ్డారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
దేశం మొత్తం చూస్తుండగా కేసు నమోదు చేసి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలను పగలగొట్టిన అ ప్రజాస్వామ్యవాది రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి ఇవేం పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుంటే అక్రమంగా అరెస్టు చేశారని జగన్ తెలపడం సిగ్గుచేటు అన్నారు .
ఈరోజు జగన్ కు రాజ్యాంగం ప్రజాస్వామ్ గుర్తుకు వచ్చింది.. రేపు మాకు అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం .
గతంలో సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అత్యాచారం చేసి భర్త సమక్షంలో అతి కిరాతకంగా హత్యాచారం చేయడం.. జగన్మోహన్ రెడ్డి కి కనపడలేదా.. నీ తాడేపల్లి ప్యాలెస్ అతి సమీపంలో మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోరు డెలివరీ చేస్తే వాన్ని పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయం చేస్తూ ఉండడం మీకు సిగ్గుచేటు అన్నారు. స్థానిక శాసన సభ్యుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని పాపాన పోలేదన్నారు.