- SPM కేంద్రాలను వైకాపా
విద్యుత్ సంస్థల్లో భారీ ప్రాజెక్టులను అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టిన గత వైకాపా పాలకులు.. ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు కేంద్రా లనూ వదల్లేదు.
డిస్కంల పరిధిలోని స్పెషల్ మెయింటెనెన్స్ (ఎస్పీఎం) కేంద్రాలను పార్టీ మద్దతు దారులకు కేటాయించారు.
అది కూడా టెండరు ప్రక్రియ ద్వారా కాకుండా నామినేషన్ విధానంలో సాంకేతికంగా అనుభవం లేని వారికి ఇష్టారాజ్యంగా అప్పగించారు.
దీంతో ట్రాన్స్ఫార్మర్లు తరచూ మర మ్మతులకు గురికావడంతో పాటు వాటి నిర్వహణ వ్యయం డిస్కంలకు భారంగా మారింది.
- ప్రైవేటు వ్యక్తులకు డిస్కంలు ఏటా రూ.200 కోట్లు
రెండు డిస్కంల పరిదిలో ఏటా 50 వేల ట్రాన్స్ఫా ర్మర్లు మరమ్మతులకు గురవుతున్నాయి. వాటికి ప్రైవేటు ఎస్పీఎం కేంద్రాల్లో మరమ్మతులు చేయించి
మళ్లీ వినియోగం లోకి తీసుకురా వాలి. దీనికోసం ఒక్కో ట్రాన్స్ఫార్మ ర కు వైండింగ్, ఇతర లేబర్ ఖర్చులు కలిపి సగటున రూ.40 వేల వరకు డిస్కంలు ఖర్చు చేస్తున్నాయి.
ఈ లెక్కన మరమ్మతు కేంద్రాలను నిర్వ హించే ప్రైవేటు వ్యక్తులకు డిస్కంలు ఏటా రూ.200 కోట్లు చెల్లిస్తున్నాయి.
ఇంత మొత్తాన్ని చెల్లించినా ట్రాన్స్ఫార్మర్ పనితీరు సామర్థ్యం మేరకు ఉండటం లేదు. వాటిలో నిర్దేశిత ప్రమాణాల కంటే
తక్కువ గేజ్ ఉన్న వైండింగ్ వైరు వాడటం వల్ల కొద్ది కాలా నికే మళ్లీ రిపేర్లు వస్తున్నాయి. ఎస్పీఎం కేంద్రాల్లో జరిగే మరమ్మతుల
పర్యవేక్షణకు డిస్కంల తరపున సరిపడా సిబ్బంది లేరు. కేవలం ఒక అసిస్టెంట్ ఇంజి నీరు స్థాయి అధికారిని మాత్రమే నియమించారు.
- బీవోటీ.. ప్రైవేటు కంపెనీకి కట్టబె ట్టారు.
విజయవాడలోని గుణదలలో విద్యుత్ సౌధ వెనుకు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్)కు చెందిన రెండు ఎస్పీఎం కేంద్రాలు ఉన్నాయి.
వాటిని దశాబ్దా లుగా డిస్కంలే నిర్వహించాయి. గతంలో సీఎండీగా పని చేసిన పద్మాజనార్ధన్ రెడ్డి మాత్రం వాటిని బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) విధానంలో ప్రైవేటు కంపెనీకి కట్టబె ట్టారు.
నిబంధనల ప్రకారం ఎసీపీఎం కేంద్రాల కోసం కాంట్రాక్టు సంస్థ షెడ్ నిర్మించి అందులో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు అవసరమైన యంత్రాలను సమకూర్చాలి.
నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత వాటిని డిస్కం లకు అప్పగించాలి. కానీ, ఇక్కడ డిస్కంలు అభివృద్ధి చేసిన ఎస్పీఎంలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి..
- ఆక్రమలే ధ్యేయంగా YSRCP ప్రభుత్వం మాయాజాలం
Also Read XElectron Android C9 Plus 1080p Native Resolution Full HD 4K Support Smart Projector
బీవోటీ విధానంలో ఇచ్చినట్లుగా దస్త్రాల్లో చూపారు. కృష్ణా జిల్లాలోని కనుమోలు, గుంటూరు జిల్లాలోని సంగడిగుంట, ప్రకాశం జిల్లాలోని ఎస్పీఎంలను ఇదే తీరులో గత ప్రభుత్వం ఇచ్చేసింది.
రాగి, అల్యూమినియం వైరులోనూ అక్రమాలు
అలాగే, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) పరిధిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్,
కర్నూలు జిల్లాల్లోని ఎస్పీఎంలనూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసింది. మరమ్మతులు చేసినందుకు షెడ్యూల్ ధరల కంటే..
2 శాతం తగ్గించిప్రైవేటు సంస్థలకు చెల్లింపులు చేసేలా డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. వారి నుంచి ఎలాంటి అద్దె తీసుకోకపో వడంతో పాటు
వినియోగించే విద్యుత్ బిల్లులు కూడా డిస్కంలు వసూలు చేయకుండా గత ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.
ట్రాన్స్ఫార్మర్లలో వైండింగ్ కోసం వినియోగించే రాగి, అల్యూమినియం వైరు విషయంలోనూ ప్రైవేటు నిర్వా హకులు అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ నుంచి 7 నుంచి 10 కిలోల వైండింగ్ వైరు తగ్గించి కొత్త వైండింగ్ చేస్తున్నారు. దీంతో మరమ్మ తులు చేసిన తర్వాత
కొద్ది నెలలకే (6 నెలల గ్యారంటీ వ్యవధి దాటిన తర్వాత) అవి దెబ్బతింటున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల నుంచి తొలగించిన పాత వైండింగ్
వైరులో కూడా కొంత మొత్తాన్ని తరలించి.. తుక్కు కింద అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.