కౌలు రైతులు త్వరగా కౌలు కార్డు లు పొందండి
ఆత్మకూరు మండలంలోని గురువారం శ్రీపతిరావు పేట మరియు కృష్ణాపురం గ్రామాలలో కౌలు రైతుల అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆత్మకూరు బి ఆంజనేయ గారు, మండల వ్యవసాయ అధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలోని పొలము కౌలుకు వేసుకుంటున్న రైతులు గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి కౌలు కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో భూ యజమానులకు మరియు కౌలు రైతులకు కౌలు కార్డుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. కౌలు కార్డు యొక్క కాలపరిమితి కేవలం 11 నెలలు మాత్రమే ఉంటుందని కావున భూ యజమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కౌలు కార్డులు పొందడం ద్వారా సబ్సిడీపై విత్తనాలు ,అన్నదాత సుఖీభవ ,పంట నమోదు, పంట బీమా, పంట నష్ట పరిహారం మరియు పంట రుణాలు మొదలైన పథకాలకు అర్హులు అవుతారని కావున గ్రామాలలోని కౌలు రైతులందరూ త్వరగా కౌలు పత్రాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు .ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారులు ,వ్యవసాయ విస్తరణ అధికారులు లతమ్మ ,రాజశేఖర్, రైతు సేవ కేంద్రం సిబ్బంది మూర్తుజావలి, నరసింహారావు, రైతు సంఘం అధ్యక్షులు బైరాపురం భాష, మరియు రైతులు పాల్గొనడం జరిగింది.