YSR వాహ‌న మిత్ర కార్య‌క్ర‌మంలో – CM YS జ‌గ‌న్

Political-hunter-news-cm-ys-jagan-mohan-reddy-scaled.jpg

  విజయవాడ ; YSR వాహ‌న మిత్ర కార్య‌క్ర‌మంలో CM YS జ‌గ‌న్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రభుత్వం వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌ లెస్‌ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం మ‌న‌ది అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్ప‌టికే 99శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. అని పేర్కొన్నారు. ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు ఉన్నారని విమర్శించారు. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. గత పాలకులకు మనసు లేదు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేశాం. గతంలోనూ ఇదే బడ్జెట్‌, మారిందల్లా సీఎం ఒక్కడే.గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారని ప్ర‌శ్నించారు. పేదవాడి ప్రభుత్వం నిలబడాలి. పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు. వచ్చే ఎన్నికలప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించాలని సూచించారు. వాళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి.. వాళ్లలాగా నాకు దత్తపుత్రుడి తోడు లేదు. వాళ్లు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేద‌న్నారు. దోచుకొని పంచుకొని తినడం నా విధానం కాదు. మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి. ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండ‌ని సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.  విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం వైయ‌స్‌ జగన్‌ శుక్రవారం విడుదల చేశారు. వాహనమిత్రతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా.. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి నిధులు జమచేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన  బహిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top