నంద్యాల జిల్లా..ముష్టపల్లె గ్రామంలోని రచ్చకట్ట దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి వున్న భారీ రావిచెట్టు..నేలకొరిగింది..
ముష్టపల్లె గ్రామానికే.. పేరు ఘటించిన ముష్టిచెట్లు.. సైతం ఇప్పటికే గ్రామంలో కను మరుగయ్యాయి..
గ్రామం నడిబొడ్డున పూర్వికులు నాటిన నాలుగు చెట్లలో.. రెండు సంవత్సరాల వ్యవధిలోనే.. రెండు చెట్లు కూలిపోయి గ్రామం బోసిపోయింది…
ఒకవైపు పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు , సాంప్రదాయాలు , ఆహారపు అలవాట్లు , కనుమరుగవుతున్న నేపథ్యంలో.. చివరకు పూర్వీకులు నాటిన చెట్లు సైతం కనుమరుగవడం.. ఒకింత ఆందోళన కలిగిస్తుంది.
రచ్చకట్ట పై కూర్చొని..పూర్వీకులు నాటిన , రావి చెట్టు, వేపచెట్టు కింద గ్రామస్తులు సేద తీరుతూ..నిత్యం రద్దీగా వుటుంది.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు..
100 ఏళ్ల పైబడి ఉన్న ఈ రావి చెట్టు వేర్లతో సహా కూలి.. సమీపంలోని రేకుల షెడ్డు పై పడింది.. ఆసమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ..పెను ప్రమాదం తప్పింది ..
అలాగే ..రెండు విద్యుత్ స్తంభాలు విరగడంతో.. విద్యుత్ వైర్లు.. తెగి కింద పడ్డాయి.. ఆసమయంలో కొందరు.. చాకచక్యంగా.. తప్పించుకున్నారు.
వారం రోజుల నుంచి ఒక పక్కకు రావిచెట్టు.. ఒరగడంతో ..
కూలిపోతుందని గ్రహించి గ్రామస్తులు అప్రమత్తంగా ఉన్నారు..
ప్రమాదం పొంచి వుందన్న ఆందోళనతో..సంబంధిత అధికారుల చుట్టూ..గ్రామస్తులు తిరిగారు..
చెట్టును తొలగించమని ప్రాధేయపడ్డారు.. అయినా అధికారులు ..స్పంధించలేదు.. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే.. ఆ నష్టం పూడ్చగలరా.. ఆ అధికారులే .. సమాధానం చెప్పాలి.