యాత్ర..2.. సినిమాలో షర్మిల పాత్ర ఎలా ఉంటుంది ..?
2019 లో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటించి నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్ట్స్ గా తీశారు. NTR కథానాయకుడు పేరుతో మొదటి భాగం జనవరి 9 న సినిమా రిలీజ్ అయింది.. మొదటి భాగంలో ఎన్టీఆర్ పుట్టుక నుంచి ఆయన సినిమా హీరోగా ఎదగటం.. చివర్లో రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో ముగుస్తుంది.

సినిమా బాగానే ఉన్నప్పటికీ పెట్టుబడి సగం కూడా రాలేదు.
ప్రేక్షకులు కూడా రెండో భాగం కోసం ఎదురు చూసింది లేదు. అయినా అప్పటికే నిర్మాణం పూర్తి అయినందున NTR మహానాయకుడు పేరుతో ఫిబ్రవరి 22 న రెండో భాగం కూడా రిలీజ్ చేశారు. ఈ రెండో భాగం పై అప్పట్లో నా ఆసక్తి ఏమిటి అంటే… మామను పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబును ఎలా చూపిస్తారు..? వెన్నుపోటుదారుడిగానా..? హీరోగా నా..? లేక అస్సలు చూపించరా..?
నా అనుమానమే నిజం అయింది. నాదెండ్ల ఎపిసోడ్ వరకు పరిమితం చేసి ప్రజా స్వామ్యాన్ని కాపాడిన హీరోగా చంద్రబాబును చూపించారు.
ఇది ప్రేక్షకులకు నచ్చకపోవడంతో సినిమా దారుణంగా చతికిలా పడింది.
2019 ఎన్నికల్లో ఈ రెండు సినిమాలు టీడీపీకి లబ్ది చేకూర్చక పోగా ఎన్టీఆర్ పై తెలుగు వారికి ఉన్న క్రేజ్ ను పరిమితం చేసింది.
…..
అదే కోవలో డా వై ఎస్సార్ జీవిత చరిత్ర, రాజకీయ ప్రస్థానం తో కూడిన బయోపిక్ సినిమా “యాత్ర” పేరుతో ఫిబ్రవరి 8 న రిలీజ్ అయింది. ఈ సినిమా వై ఎస్సార్ రాజకీయ జీవితానికి, ఆయన వ్యక్తిత్వనికి, ఓ మాదిరి అద్దం పట్టేలా ఉండటంతో మరీ సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. పెట్టిన డబ్బులు తిరిగి రావడం తో నిర్మాత safe అయ్యాడు.
….
ఐదేళ్ల తర్వాత సరిగ్గా అదే రోజున (ఫిబ్రవరి 8) యాత్ర..2 సినిమా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమా కథాంశం ఏమై ఉంటుంది..?
వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర, సొంత పార్టీ పెట్టడం, అక్రమ కేసులతో జైలుకు వెళ్ళటం, 2014-19 మధ్య ప్రతిపక్ష పాత్ర, అసెంబ్లీ లో జగన్ గొంతు నొక్కెయటం, ప్రజా సంకల్ప యాత్ర, 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయం తో అధికారం చేపట్టడం, సంక్షేమ పథకాలు, మొత్తం మీద ఈ సినిమా ద్వారా రాబోయే ఎన్నికల్లో వైసీపీ కి లబ్ది చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది అని సగటు ప్రేక్షకుడు ఎవ్వరైనా చెప్పగలరు.
అయితే, ఇప్పుడు జగన్ కు రాజకీయ శత్రువులా మారిన వై ఎస్ షర్మిల పాత్రను ఎలా చిత్రీకరించి ఉంటారు..? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
జగన్ జైలుకు వెళ్ళినప్పుడు బాణంలా దూసుకు వెళ్లి పార్టీని నిలబెట్టిన సంగతి విస్మరిస్తారా..? 2019 ఎన్నికల ముందు ” బై బై బాబూ ” అంటూ షర్మిల చేసిన రణన్నినాదం టీడీపీ శత్రుశ్రేణులను కకావికలు చేసిన విషయాన్ని పక్కన బెట్టి ఉంటారా..? అసలు షర్మిల పాత్రే లేకుండా చేశారా..?
షర్మిల పాత్ర లేకుండా తీసి ఉంటే ఆ సినిమా ఔచిత్యాన్ని ప్రేక్షకులు ప్రశ్నించకుండా ఉంటారా..?
ఈ నా పోస్టు కేవలం ఒక సినిమా ప్రేక్షకుడిగా మాత్రమే నని… రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదనీ.. పాఠకులు గమనించగలరు.