యాగంటి లో కాకి ఎందుకు కనిపించదు…?
“యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి రంకెలేసేను”అని బ్రహ్మం గారు చెప్పినట్లు పాపులర్ పాట ఒకటి ఉంది. మీరు కూడా వినే ఉంటారు. ఇక్కడ ఉన్న కొండశిలనే ఇలా బసవన్న గా మలిచారా..! లేక నిజంగానే పెరిగాడా? ఒకవేళ పెరిగి ఉంటే ఎందుకు ఇలా పెరిగాడు.? వంటి చర్చలు గతం లో జరిగాయి. హేతువాదులు ఈ బసవన్న పెరుగుదల వెనుక ఉండే సైన్స్ ఏమిటో కూడా శోధించి చెప్పే ప్రయత్నం చేశారు.
అదేమంటే.. అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే కాకులు వచ్చి కావ్ కావ్ అని అరుస్తూ డిస్టర్బ్ చేశాయట. దీంతో కోపమొచ్చిన మహర్షి ఈ చుట్టుపక్కల కనిపించ వద్దని కాకుల్ని శపించారట.
కాకి అనే పక్షి శనీశ్వరుడికి వాహనం కాబట్టి, యాగంటి లో శనీశ్వరుడు ప్రవేశించ లేడట.
కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు గలదని భక్తుల విశ్వాసం. ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా , బనగాన పల్లి మండలం లో ఉన్న యాగంటి క్షేత్రానికి , నంద్యాల నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
#yaganti #yagantitemple