ఏదైనా హానికార పదార్థం మన శరీరాన్ని తాకినా, లేదా శరీరంలోకి . ప్రవేశించినా శరీరం స్పందించి స్వీయ రక్షణవ్యవస్థను చైతన్యపరిచి ఆయా పదార్థాలు లేదా వస్తువులను తిరస్కరించి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు కంటిలో నలుసు కాని, దుమ్ముధూళిలాంటివి కాని పడితే వివిధ చర్యల ఫలితంగా కంటిలో నీరు ఎక్కువగా ఉత్పత్తి అయి చివరకు ఆ పదార్థాన్ని బైటకు నెట్టివేస్తుంది.
అలాగే కలుషిత ఆహార పానీయాదుల వల్ల హానికారక పదార్థాలు కడుపులో చేరినప్పుడు వాంతులు, విరేచనాల రూపంలో వాటిని తిరస్కరించి స్వస్థత పొందడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా బాహ్య వాతావరణం, ఉష్ణోగ్రతల ప్రభావం కూడా శరీరంపై పడినప్పుడు వాటికి కూడా స్పందించి తదనుగుణంగా శరీరావయవాలు, కణాలు, గ్రంథులు, కణజాలాలు మొదలైన వాటిలో కూడా మార్పులు చెందుతూ తననుతాను రక్షించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఈ ప్రయత్నంలో శరీర శక్తి బలహీనంగా ఉన్నప్పుడు బాహ్య వాతావరణ ప్రభావాలను తట్టుకోలేక వివిధ రకాల లక్షణాలను వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు వేసవికాలంలో చెమటకాయలు, పొక్కులు, వడదెబ్బ, మూత్రంలో మంట, విరేచనం సాఫీగా కాకపోవడంలాంటి లక్షణాలు వ్యక్తం చేస్తుంది. ఇలాంటి బాధలనుంచి త్వరగా ఉపశమనం పొందేందుకే కాకుండా, వాటిబారిన పడకుండా ఉండేందుకు శరీరం స్వభావరీత్యా రక్షించుకునే ప్రయత్నానికి చేదోడుగా, శరీరానికి శీతలత్వాన్ని కలుగజేసే వట్టివేరు, సుగంధిపాల, ద్రాక్ష చందనంలాంటి శక్తివంతమైన ఔషధ మొక్కల ప్రస్తావన ఆయుర్వేదంలో కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో ప్రస్తుతం వట్టివేరు ఔషధగుణాలను తెలుసుకుందాం.
వట్టివేళ్లను సంస్కృతంలో ఉశీర అంటారు. పోయేసీ అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం వటివేరియా జిజినాయిడిస్.
నీటి ఒడ్డున విశేషంగా పెరగడం వల్ల జలవాస అని, అత్యంత సుగంధ యుక్తంగా ఉండటం వల్ల గందాఢ్య, సుగంధిపాల అని, వేరు చలువ చేసే స్వభావం ఉండటం వల్ల శీతమూలక అని కూడా అంటారు.
వట్టివేళ్లతో తయారు చేసిన బుట్టలు, చాపలు, వట్టివేళ్ల తెరలు, విసనకర్రలు ఇప్పటికీ వాడుకలో ఉండటం గమనార్హం. అంతేకాక వివిధ రకాల శీతల పానీయాలు, చర్మసౌందర్య పోషకాల తయారీలో, సబ్బుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు.
వట్టివేళ్లలో సుగంధిత తైలం, కాల్షియం, లోహం తాలూకు అంశాలు, సువాసన తైలంలో వట్టి వెనాల్, వట్టి వెరాల్, వట్టివోన్స్ మొదలైన రసాయనాంశాలు ఉన్నట్లు వెల్లడైంది. వట్టివేరు, పటికబెల్లం చూర్ణాలను సమంగా కలిపి ఒక స్పూను వంతున రోజూ రెండుమూడుసార్లు సేవిస్తుంటే కడుపులో, మూత్రంలో మంట, నొప్పి, మూత్రం ధారాళంగా రాకపోవడం, అతివేడి వంటి బాధలు తగ్గుతాయి. జ్వర తీవ్రత తగ్గుతుంది.
వట్టివేరు, శ్రీగంథం పొడులను సమంగా కలిపి పంచాదార కలిపిన బియ్యం కడుగు నీటితో సేవిస్తుంటే నోరు, ముక్కు, మలద్వారం నుంచి రక్తం పడటం వంటి సమస్యల తగ్గుతాయి.
అలాగే బహిష్టు సమయంలో కలిగే అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది. వేడికి సంబంధించిన ఏ లక్షణాలు కనిపించినా ఈ ఔషధాన్ని తేనెతో కలిపి కాని, నీటిలో రెండుమూడు గంటలు నానబెట్టి ఆ నీటిని కాని సేవించవచ్చు. వట్టివేరు చూర్ణం నీటితో కలిపి ఒంటికి పట్టించుకుంటూ ఉంటే చెమట ఎక్కువగా పట్టకుండా ఉండటమేకాక, చెమట పొక్కులు శరీర మంటలు తగ్గుతాయి. గుమ్మాలకు, కిటికీలకు తడిపిన వట్టివేరు తెరలు కట్టుకుంటే వేసవి తీవ్రత తెలియదు. మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వట్టివేళ్లు, కచూరాలు, తుంగముస్తలు, సుగంధిపాల చూర్ణాలను సమంగా గ్రహించి ఒక స్పూను పొడిని తగినంత పంచదారతో కలిపి తీసుకుంటూ ఉంటే ‘ అమిత చలువ చేస్తుంది. వేసవి తాపాన్నుంచి కాపాడుతుంది.
నీటి ఒడ్డున విశేషంగా పెరగడం వల్ల జలవాస అని, అత్యంత సుగంధ యుక్తంగా ఉండటం వల్ల గందాఢ్య, సుగంధిపాల అని, వేరు చలువ చేసే స్వభావం! ఉండటం వల్ల శీతమూలక అని కూడా అంటారు.
వట్టివేళ్లతో తయారు చేసిన బుట్టలు, చాపలు, వట్టివేళ్ల తెరలు, విసనకర్రలు ఇప్పటికీ వాడుకలో ఉండటం గమనార్హం. అంతేకాక వివిధ రకాల శీతల పానీయాలు, చర్మసౌందర్య పోషకాల తయారీలో, సబ్బుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు.
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
వట్టివేళ్లలో సుగంధిత తైలం, కాల్షియం, లోహం తాలూకు అంశాలు, సువాసన తైలంలో వట్టి వెనాల్, వట్టి వెరాల్, వట్టివోన్స్ మొదలైన రసాయనాంశాలు ఉన్నట్లు వెల్లడైంది. వట్టివేరు, పటికబెల్లం చూర్ణాలను సమంగా కలిపి ఒక స్పూను వంతున రోజూ రెండుమూడుసార్లు సేవిస్తుంటే కడుపులో, మూత్రంలో మంట, నొప్పి, మూత్రం ధారాళంగా రాకపోవడం, అతివేడి వంటి బాధలు తగ్గుతాయి. జ్వర తీవ్రత తగ్గుతుంది.
వట్టివేరు, శ్రీగంథం పొడులను సమంగా కలిపి పంచాదార కలిపిన బియ్యం కడుగు నీటితో సేవిస్తుంటే నోరు, ముక్కు, మలద్వారం నుంచి రక్తం పడటం వంటి సమస్యల తగ్గుతాయి.
అలాగే బహిష్టు సమయంలో కలిగే అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది. వేడికి సంబంధించిన ఏ లక్షణాలు కనిపించినా ఈ ఔషధాన్ని తేనెతో కలిపి కాని, నీటిలో రెండుమూడు గంటలు నానబెట్టి ఆ నీటిని కాని సేవించవచ్చు. వట్టివేరు చూర్ణం నీటితో కలిపి ఒంటికి పట్టించుకుంటూ ఉంటే చెమట ఎక్కువగా పట్టకుండా ఉండటమేకాక, చెమట పొక్కులు శరీర మంటలు తగ్గుతాయి. గుమ్మాలకు, కిటికీలకు తడిపిన వట్టివేరు తెరలు కట్టుకుంటే వేసవి తీవ్రత తెలియదు. మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వట్టివేళ్లు, కచూరాలు, తుంగముస్తలు, సుగంధిపాల చూర్ణాలను సమంగా గ్రహించి ఒక స్పూను పొడిని తగినంత పంచదారతో కలిపి తీసుకుంటూ ఉంటే ‘ అమిత చలువ చేస్తుంది. వేసవి తాపాన్నుంచి కాపాడుతుంది.