అస్తమిస్తున్న మావోయిస్టు ఉద్యమం

The fading Maoist movement

The fading Maoist movement

అస్తమిస్తున్న మావోయిస్టు ఉద్యమం: భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కమ్యూనిస్టు పార్టీఆఫ్ ఇండియా –మావోయిస్టు (CPI-మావోయిస్టు) ఉద్యమం, ఒకప్పుడు దేశంలోని “అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు” గా పేర్కొనబడిన ఈఉద్యమం, ఇప్పుడు చారిత్రాత్మక మలుపు దశకు చేరుకుంది. 2026 ఫిబ్రవరి 22న, CPI-మావోయిస్టు ప్రధానకార్యదర్శి, వ్యూహకర్త మరియు సెంట్రల్మిలిటరీ కమిషన్ (CMC) అధిపతి అయిన తిప్పరి తిరుపతి @ దేవుజీ @ దేవోజీ @ సంజీవ్ @ చేతన్ @ రమేష్ @ కుమ్మా @ శంకర్ @ శేషు @ జగన్ @సుధర్షన్, @ దేవన్న (60) తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడు. అతని లొంగుబాటు దశాబ్దాలుగా ఈ తిరుగుబాటు ఎదుర్కొన్న అత్యంత ముఖ్యమైన వెనుకడుగులలో ఒకటిగా భావించబడుతోంది. వివిధ నివేదికల ప్రకారం, దేవుజీ, సంగ్రామ్లతో సహా మరో 21 మందికేడర్లు కూడాతెలంగాణ పోలీసుల స్పెషల్ ఇంటెలిజెన్స్ (SIB) ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. దేవుజీ లొంగుబాటు కేవలం వ్యూహాత్మక పరాజయం మాత్రమేకాదు — అది ఉద్యమం యొక్క కేంద్రీయ నాడీవ్యవస్థ కూలిపోయినట్లుగా సూచిస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని (LWE) నిర్మూలించాలని నిర్ణయించిన గడువుకుకొద్ది వారాల ముందు జరిగిన ఈ పరిణామం, దశాబ్దాలుగా సాగుతున్న ఘర్షణలో కీలక మార్పును సూచిస్తోంది.

  1. దేవుజీ లొంగుబాటు CPI-మావోయిస్టు సంస్థాగత నిర్మాణానికి తీవ్రమైన దెబ్బగా భావించబడుతోంది. 2025 మే 21నభద్రతాదళాలు (SFs) నిర్వహించిన పెద్ద ఆపరేషన్‌లో మరణించిన నంబాల కేశవరావు తరువాత నాయకత్వాన్ని చేపట్టిన దేవుజీ, సైనిక వ్యూహాలు మరియు పీపుల్స్లిబరేషన్గెరిల్లా ఆర్మీ (PLGA) కార్యకలాపాలలో కీలకపాత్ర పోషించాడు.
  2. అధికారుల ప్రకారం, దేవుజీ వైదొలగడం నిషేధిత సంస్థ కమాండ్స మన్వయానికి “చావుదెబ్బ” గా మారింది. దేవుజీ స్థాయి నాయకుడు పట్టుబడటం లేదా లొంగిపోవడం అరుదైన విషయం. ఇది బస్తర్, అబుజ్‌మఢ్ సమీప అటవీ ప్రాంతాలలో గెరిల్లా కార్యకలాపాలను కొనసాగించడంలో మావోయిస్టు ఉన్నత నాయకత్వం క్రమంగా అసమర్థంగా మారుతున్నదని సూచిస్తోంది. భద్రతాదళాల నిరంతర ఒత్తిడి కారణంగా కొత్త సభ్యుల నియామకం, కేడర్లను నిలుపుకోవడం, ఆయుధ నిల్వలను నిర్వహించడం మరింత కష్టమవుతోంది.
  3. దేవుజీ లొంగుబాటు, ముఖ్యంగాతెలంగాణ–ఛత్తీస్‌గఢ్సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో భద్రతా దళాలు నిర్వహించిన సమన్వయ ఆపరేషన్ల తరువాత జరిగింది. ఈ ఆపరేషన్లలో మావోయిస్టుల కార్యాచరణ స్థావరాలు ధ్వంసమయ్యాయని, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు, నాయకత్వ వర్గాలను లక్ష్యంగా చేసుకుని కమ్యూనికేషన్వ్యవస్థలను దెబ్బతీసినట్లు అధికారులు తెలిపారు.
  4. బలప్రయోగ హెచ్చరికలతో పాటు సామాజిక-ఆర్థిక ప్రోత్సాహకాలను కలిపిన ప్రభుత్వ విధానం గత రెండు సంవత్సరాల్లో వరుస లొంగుబాట్లకు దారితీసింది. ఈ పథకాల ద్వారా వందలాది మావోయిస్టు నాయకులు మరియు కేడర్లు ఇప్పటికే “జన జీవన స్రవంతి లో తిరిగిచేరారు” అని అధికారులు చెబుతున్నారు.
  5. దేవుజీ లొంగుబాటు, మిగిలిన మావోయిస్టు కేడర్లు కూడా లొంగి పోయే ప్రేరకంగా మారవచ్చు. నైతికత మరియు సంస్థాగత ఐక్యతక్షీణించడంతో, ఆయుధ పోరాటాన్ని కొనసాగించాలా అనేఅంశం పై పార్టీలో విభేదాలు కూడా తలెత్తే అవకాశముంది. అయితే కొంతమంది కఠినవాదులు చివరి వరకు పోరాడే అవకాశమూ ఉంది. అందువల్ల సంఘటిత తిరుగుబాటు పూర్తిగా ముగిసిందని ప్రకటించడం ఇప్పుడే తగదు. నాయకత్వ నష్టాలున్నప్పటికీ, ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇంకా సాయుధ కేడర్ల సమూహాలు ఉన్నాయి. తిరుగుబాటుకు కారణమైన నిర్మాణాత్మక సమస్యలకు పరిష్కారం లభించకపోతే, కార్యాచరణబలం తగ్గినా సిద్ధాంతపరమైన ఆకర్షణ కొనసాగవచ్చు.
  6. దేవుజీ లొంగుబాటు భారతదేశం మావోయిస్టు తిరుగుబాటుపై సాగిస్తున్న దీర్ఘకాలపోరాటంలో ఒక వ్యూహాత్మక మలుపుగా నిలుస్తోంది. నిరంతర భద్రతా ఒత్తిడి, పునరావాస ప్రోత్సాహకాలు, మరియు CPI-మావోయిస్టు సంస్థలో పెరుగుతున్న బలహీనతల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అయితే ఇదే తిరుగుబాటు ముగింపు అని ప్రకటించడం అర్ధసత్యమే అవుతుంది. నాయకత్వ ఖాళీలు మరియు వరుస లొంగుబాట్లు కార్యకలాప సామర్థ్యాన్ని తగ్గించినప్పటికీ, ఘర్షణకు మూలమైన నిర్మాణాత్మక కారణాలు, విస్తరించి ఉన్న కేడర్ నెట్‍వర్కులు, మరియు ప్రభావితప్రాంతాల సామాజిక-ఆర్థికసవాళ్లు భవిష్యత్ పరిస్థితిని నిర్ణయించే ప్రధాన అంశాలుగా మిగులుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top