- మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణ కోసం దేశ ప్రజలు, యువత ముందుకు రావాలి :సిపిఎం
AP నంద్యాల జిల్లా ఆత్మకూరు : ఉగ్రవాదం మతోన్మాదం అనేవి ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించినవి కాదని వీటిని రూపుమాపడానికి ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.యేసు రత్నం, నర్సింహ నాయక్, కృషి పండ్ల తోటల సంఘం అధ్యక్షులు మహబూబ్ బాషా లు అన్నారు.
సోమవారం పట్టణంలోని స్థానిక తెరిసా కాలేజ్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మతసామరస్యం వర్ధిల్లాలి దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడాలని నినాదంతో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం ఘటనలో 26 మందిని బలిగొన్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆపరేషన్ సింధూరం పేరుతో పాకిస్థాన్పై దాడి ప్రారంభించిన మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఆదేశాలతో కాల్పుల విరమణ చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేక పోయిందని అన్నారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు అక్కడి ముస్లింలే ఆశ్రయం కల్పించి వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి తోడ్పడ్డారని గుర్తు చేశారు. భారతదేశ యువకులకు అమెరికా సంకెళ్లు వేసి సైనిక విమానంలో దేశానికి పంపించిన మోడీ మాట్లాడలేదన్నారు.
యువకులను సొంత విమానాల్లో ఆయా దేశాలకు తీసుకెళ్లాయని తెలిపారు. ఈ రకమైన పాలనను ఎండగట్టి దేశంలో సోషలిజం స్థాపించడానికి కమ్యూనిస్టు పార్టీ ఒకటే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు దేశ సమైక్యత సమగ్రత కోసం నిజాయితీగా నిలబడేది ఎర్రజెండా మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి పేట కౌలు రైతు సంఘం అధ్యక్షులు ఆశ్రఫ్ వలి, శ్రీనివాసులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఏం. రజాక్ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, పట్టణ నాయకులు డి రామ్ నాయక్, ఏ సురేంద్ర, జి నాగేశ్వరరావు, వీరన్న, కొత్తపల్లి మండల కార్యదర్శి ఎన్ స్వాములు, ఆత్మకూరు మండల నాయకులు చందా వారి వెంకటేశ్వర్లు, మా భాష, సంజీవ రాయుడు, దాసు, కిరణ్, పాలశివుడు,తుమ్మలూరు శివకుమార్,
Terrorism and fanaticism are a danger.. CPM