జర్నలిస్టు ల సమస్యలు

Problems of journalists

Problems of journalists

సమాచార శాఖ కమిషనర్ హిమాన్షు శుక్ల ఐఏఎస్ దృష్టికి జర్నలిస్టు సమస్యలు..

జర్నలిస్టు సమస్యలపై సమాచార శాఖ కమిషనర్ హిమాన్షు శుక్ల ఐఏఎస్ కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ నాయకులు డాక్టర్ బండి సురేంద్రబాబు..

అమరావతి: జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హిమాన్షు శుక్ల ఐఏఎస్ ను కలసి వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు…

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వ్యవస్థకు ఊపిరి వంటిది. అలాంటి జర్నలిజంను ఊపిరిగా భావించి జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజంలో అసమానతలు తొలగించి సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. జర్నలిస్టులు ఆర్ధికంగా, వృత్తి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కొరకు స్థాపించిన “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” జర్నలిస్టుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపటానికి జాతీయ స్థాయిలో అవిశ్రాంత పోరాటం చేస్తూ అనతికాలంలోనే భారతదేశంలో అత్యధిక సభ్యులు కలిగి జర్నలిస్టుల గుండెచప్పుడు గా అగ్రభాగంలో నిలిచింది.. ఎన్.ఎ.ఆర్.ఎ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుల కి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా కృషి చేస్తూ వస్తుంది. జర్నలిజం మూలాలను బ్రతికించి, జర్నలిస్టుల విలువను పెంచడానికి “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది..

‘అభద్రత‘ లో ఉన్న రంగం కేవలం ఒక్క ‘పాత్రికేయం’ మాత్రమే. అందుకే పాత్రికేయ రంగం లో ఉన్నటువంటి ఈ అభద్రతా భావం నుండి నిజమైన పాత్రికేయ మిత్రులను సంరక్షించి వారికి ఓ సరైన మార్గాన్ని నిర్దేశించి దాని కొరకు అహర్నిశలూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తరపున అనేక కమిటీలు ఏర్పాటు చేసి జర్నలిస్టులకు, ప్రభుత్వాలకు ఒక వారధిలా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తోంది. స్మాల్ న్యూస్ పేపర్స్ వింగ్, న్యూ మీడియా వింగ్ (యూ ట్యూట్, వెబ్ సైట్స్), యూత్ వింగ్, ఉమెన్స్ వింగ్, అక్రిడిటేషన్ కమిటీ, ఆర్టీఏ వింగ్, లీగల్ వింగ్, స్టడీ టీమ్, నిజ నిర్ధారణ కమిటీ, హ్యూమన్ రైట్స్ వింగ్, సర్వే వింగ్, యాక్షన్ కమిటీ, ఫిల్మ్ & టివి ఇండస్ట్రి వింగ్, ఆడిట్ వింగ్ లాంటి వివిధ కమిటీల రూపంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి జీవితాల్లో వెలుగులు చూడటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతుంది.

జర్నలిస్టు కార్పోరేషన్” ఏర్పాటు చేయాలి

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హిమాన్షు శుక్ల ఐఏఎస్ కు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ముఖ్యమైన డిమాండ్లను వినతి పత్రం రూపంలో ఆయన ముందు ఉంచింది. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని, జర్నలిస్టులకు సంక్షేమ రక్షణ విషయంలో రాష్ట్ర సమాచార శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియచేసిన సమాచార శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా ఐఏఎస్ కు కు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలియచేసారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) డిమాండ్స్.

  1. సంక్షేమ నిధితో కూడిన “జర్నలిస్టు కార్పోరేషన్” ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించాలి.
  2. ‘కత్తి కన్నా కలం గొప్పది’ అంటారు. ఆ కలం ఇప్పుడు మూగబోతుంది. కలం ఉప్పెనకి కొందరు ఉన్మాదులు అడ్డుకట్ట వేస్తున్నారు. నోరు తెరిస్తే చంపేస్తున్నారు. నిజం రాస్తుంటే నిర్జీవులుగా చేస్తున్నారు. జర్నలిజాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు. జర్నలిస్టులపై దాడులు జరిగితే నాన్ బెయిలబుల్ వారెంట్ తో కూడిన కఠిన చట్టాలు తీసుకువచ్చి, జర్నలిస్టులపై దాడులు నివారణకు ప్రత్యేక చట్టంతో నిరోధక కమిటీ ఏర్పాటు చేయాలి. గతంలో ఉన్న హై పవర్ కమిటీలను పునరుద్దించాలి..
  3. పెండింగ్ లో ఉన్న చిన్న తరహా, మధ్య తరహా, వార, పక్ష, మాస దినపత్రికలకు ఎంప్యానల్ ప్రక్రియను పూర్తి చేసి, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి..
  4. ఎంప్యానల్ దిన పత్రికలతో పాటు, రెగ్యులర్ గా వచ్చే చిన్న తరహా, మధ్య తరహా, వార, పక్ష, మాస పత్రికలు, పిరియాడికల్ ఇలా అన్నింటికీ ప్రతినెలా 10వేల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి వాటి మనుగడకు తోడ్పడాలి..
  5. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన “న్యూ మీడియా” మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన అన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ న్యూస్ చానళ్లను గుర్తించి వాటిలో పని చేస్తున్న జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు అక్రిటిటేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఎంపానెల్ మెంట్ (రేట్ కార్డు) సదుపాయం కల్పించాలి.
  6. అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్ట్ సంఘాలకు, మహిళా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలి..
  7. జర్నలిస్టుల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జర్నలిస్టు అవార్డులను ప్రకటించాలి..
  8. ప్రతినెలా జర్నలిస్టుల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి..
  9. పెండింగ్ బిల్లులను (అడ్వర్టైజ్మెంట్) వెంటనే విడుదల చేయాలి..
  10. చిన్న తరహా, మధ్య తరహా పత్రికలకు యాజమాన్య కార్యాలయాలకు స్థలం కేటాయించాలి..

పాత్రికేయులు బెలూన్స్ లాంటి జీవితాలు.!

  1. పాత్రికేయులవి బెలూన్స్ లాంటి జీవితాలు! రంగు రంగుల బెలూన్స్ చూడముచ్చటగా ఉంటాయి. ప్రతి గొప్పోడి ఫంక్షన్లో తోరణంలా మారతాయి. ఫంక్షన్ ముగియక ముందే పగిలిపోతాయి! ఆ తరువాత చూస్తే ఏమి ఉండదు! పాత్రికేయులు అంతే! చాలామంది పాత్రికేయులు ఒంటరిగా బతుకు జీవనం సాగిస్తున్నారు. పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ఒక వృద్దాశ్రమం అవసరం… ప్రభుత్వం అమరావతిలో ఐదు ఎకరాలు కేటాయించి అందుకు అవసరమైన భవనాలు, గదులు నిర్మించి సౌకర్యాలు కల్పించాలి. ఒంటరి జర్నలిస్టులను, నిరుపేద జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి. వారి చివరి దశలో ప్రభుత్వం అండగా ఉండాలి. వారు చనిపోయినప్పుడు ప్రత్యేకంగా గౌరవంగా అంత్యక్రియలు జరగాలి. త్వరగా ఈ దిశగా అడుగులు పడాలని, మంచి వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలని, ఒంటరిగా జీవిస్తున్న జర్నలిస్ట్ మిత్రులకు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాము.
  2. గత ప్రభుత్వం హయంలో ఆగిపోయిన జర్నలిస్టుల సంక్షేమ పథకాలను, మీడియా కమిటీలు అన్నిటిని పునర్దించాలి .
  3. గతంలో ఉన్న జర్నలిస్ట్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్దించి రూ10 లక్షలు నుంచి 20 లక్షలకి పెంచాలి..
  4. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి పక్కా ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి..
  5. అక్రిడేషన్ కలిగిన పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో ఫీజుల రాయితీ కల్పించాలి..
  6. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలవబడే జర్నలిస్టులకు ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనం లాగే, వర్కింగ్ జర్నలిస్టులందరికి ప్రభుత్వం 10వేలు గౌరవ వేతనం ఇచ్చి జర్నలిజం విలువను కాపాడాలి..
  7. విద్యారంగంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు జర్నలిజం గురించి ఒక చాప్టర్ పెట్టాలి.
  8. సీనియర్ జర్నలిస్టులకు, విశ్రాంత జర్నలిస్టులకు 10వేల రూపాయల పెన్షన్ అందించాలి.
  9. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు పరిమితిలేని (అన్ లిమిటెడ్) హెల్త్ కార్డులు ఇవ్వాలి. అన్ని రకాల జబ్బులకు అన్ని ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు పని చేసేటట్లు చర్యలు తీసుకోవాలి..
  10. అర్హత కలిగిన జర్నలిస్టులందరికి రైల్వే పాసులు మంజూరు చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి..
  11. జర్నలిస్టులందరికీ రాష్ట్ర మరియు జాతీయ రహదారులపై ఉచిత టోల్ ప్లాజా సౌకర్యం కల్పించాలి.
  12. చిన్న తరహా, మధ్య తరహా, వార, పక్ష, మాస పత్రికలు ప్రింటింగ్ ప్రెస్ కొనుగోలుకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, దానికి కావాల్సిన స్థలం కేటాయించాలి.
  13. జర్నలిజం యూనివర్సిటీ ఏర్పాటు చేసి జర్నలిజం మూలాలకు ప్రోత్సాహం ఇవ్వాలి..
  14. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో జర్నలిస్టుల సమస్యలు కోసం ప్రత్యేక జర్నలిస్ట్ సెల్ ఏర్పాటు చేయాలి… ఈ సెల్ లో జర్నలిస్టులకు న్యాపరమైన, రక్షణ పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలి…

అక్రిడిటేషన్ కార్డులు మంజూరు

  1. చిన్న తరహా, మధ్య తరహా పత్రికలకు లోకల్ పబ్లికేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 4 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.. అలానే 4 స్టేట్ పాసులు ఇవ్వాలి..
  2. రెగ్యులర్ గా వచ్చే చిన్న తరహా, మధ్యతరహా, వార, పక్ష, మాస పత్రికలకు జీఎస్టీ, ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేయాలి.
  3. పై డిమాండ్లపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు తెలియజేశారు..

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top