ఉమ్మడి నెల్లూరు జిల్లా..గూడూరు..
వైకాపా MLC మేరిగ మురళీధర్ కు గూడూరు రూరల్ పోలీసులు నోటీసులు..లెక్కచేయని MLC..
గూడూరు రూరల్ పరిధిలో లీజు ముగిసిన శ్రీనివాస మైన్ లో అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయల క్వార్జ్ అక్రమంగా దోచేస్తున్నారని ఈ మైన్ సందర్శనకు MLCమేరిగధర్
వైసీపీ నాయకులు,కార్యకర్తల తో కలిసి ఈ రోజు 10 గంటలకు సందర్శనకు వెళుతున్నారని సోషల్ మీడియాలో తెలపడం తో సమాచారం తెలుసుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఈ శ్రీనివాస మైన్ ప్రైవేటు వ్యక్తులకు చెందిందని ఈ మైన్ సందర్శన చేయాలంటే ప్రభుత్వ అనుమతి కానీ,AD మైన్స్ అనుమతి కానీ,పోలీసు అనుమతి ఉండాలని అవి లేవు కావున భారత న్యాయ సంహిత శిక్షాస్మృతి సెక్షన్ 168 కింద రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ నోటీసులు అందించారు,దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్నాయి…
శ్రీనివాస మైన్ లో కోట్ల రూపాయల సంపద దోచేస్తున్న అక్రమార్కులు
పేలుడు యంత్రం గూడూరు గాంధీనగర్ సమీపం లో టిడ్కో ఇళ్ల సమీపంలోని డంపింగ్ యార్డులో దాచిపెట్టినట్టు సమాచారం
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరు రెవిన్యూ పంచాయతీ పరిధిలోని శ్రీనివాస మైన్ లో వందల కోట్ల క్వార్జ్ నిల్వలు వున్నాయి, ఈ మైన్ కు లీజులు ముగియడం తో యజమానులు పనులు ఆపేసి వున్నారు,,ఇప్పుడు ఈ శ్రీనివాస మైన్ పై అక్రమార్కుల కన్ను పడింది, ఇంకేముంది యదేచ్చగా అక్రమ మైనింగ్ రవాణా మొదలు పెట్టీ కోట్ల రూపాయలు క్వార్జ్ దోచేయడం మొదలుపెట్టారు, భారీ పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ ఉండటం వల్ల చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు..
ఈ దందా లో గత ప్రభుత్వం లో మైనింగ్ డాన్ గా చక్రం తిప్పి ఎలక్షన్ ముందు పార్టీ మారి ఇప్పుడు ఓ ఎంపీ అనుచరుడిగా చెలామణి అవుతూ వున్న నెల్లూరుకు చెందిన ఓ యాదవ నాయకుడు సైదాపురం మండలం జోగిపల్లికి చెందిన మరో వ్యక్తి,,మైనింగ్ సిండికేట్ తో కలిపి కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు అండ దండలతో వందల కోట్ల మైనింగ్ దోపిడీ మొదలు పెట్టీ యదేచ్చగా కొనసాగిస్తున్నారు.

ఈ రోజు MLC మేరిగ మురళీధర్ ఈ శ్రీనివాస మైన్ సందర్శన చేస్తారు అన్న సమాచారం తో గత రాత్రికి రాత్రి మైన్ లోని భారీ యంత్రాలు,పేలుడు పదార్థాలు,పేలుడు పదార్ధాలు కు రంద్రాలు చేసే యంత్రాలు,టిప్పర్ లు అన్ని గూడూరు లోని పలు ప్రాంతాలకు తరలించినట్టు, పేలుడు పదార్థాలు కు ఉపయోగించే యంత్రం తో పాటు ఇటాచి నీ గూడూరు సమీపంలోని టిడ్కో ఇళ్ల వెనకాల ఉన్న డంపింగ్ యార్డు లో దాచిపెట్టినట్టు పూర్తి ఆధారాలతో సహా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి…
జగన్ ప్రభుత్వం లో మైనింగ్ రక్తం మరిగిన డాన్ లు అంతకు మించి అక్రమ మైనింగ్ చేస్తున్నారని 20 అడుగులు కు లోపు పేలుడు పదార్థాలు ఉంచాలిసిన 50 అడుగుల మేర రంద్రాలు వేసి పేలుడు చేపట్టడం తో మంగళపూరు గ్రామం లో ఇళ్ళు లో భూకంపం వచ్చినట్టు కంపించి పోతున్నాయని పార్టీలు మారినా ప్రవర్తన మారని ఈ డాన్ లు ను ఎవరు ఆపగలరని ప్రజల ప్రాణాలు,ప్రకృతి ఘోష పట్టించుకునే వారు లేరని ప్రజలు వాపోతున్నారు….