కొడుకు ఆన్లైన్ బెట్టింగ్- తల్లి,తండ్రి ప్రాణాలు బలి

Online betting mother father suicide

Online betting mother father suicide

కొడుకు ఆన్లైన్ లో బెట్టింగ్…

తల్లి , తండ్రి నిండు ప్రాణాలు బలి

నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామంలో మహేశ్వర్ రెడ్డి , ప్రశాంతి అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనతో అబ్దుల్లాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి .. విగత జీవులుగా పడివున్న ఆజంట చూసిన ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు ఆగలేదు

వివరాల్లోకి వెలితే మహేశ్వర్ రెడ్డి , ప్రశాంతి దంపతులు కొడుకు నిఖిలేశ్వర్ రెడ్డి ఆన్ లైన్ లో బెట్టింగ్ లకు పాల్పడి కోట్ల రూపాయలు అప్పు చేశాడు

వారికీ ఒకే కొడుకు కావడంతో చాలా గారాబంగా పెంచారు . కొడుకు మీద ఉన్న ప్రేమతో .. చేసిన అప్పులు ఒక్కొక్క టిగా తీర్చు కుంటూ వచ్చారు .

కొడుకు చేసిన అప్పును కట్టడానికి మహేశ్వర్ రెడ్డి తనకున్న ఎనిమిది ఎకరాల పొలంలో 5 ఎకరాల భూమిని అమ్మి రెండు కోట్ల మేర అప్పు తీర్చాడు.

అయినా పూర్తి స్థాయిలో అప్పు తీరలేదు

మీ కుమారుడు అప్పు ఉన్నాడని ప్రతిరోజు తండ్రి మహేశ్వరెడ్డికి ఫోన్లు రావడంతో .. మిగిలిన మూడు ఎకరాలు అమ్మిన అప్పులు తీర్చలేమన్న భయం అదంపతులకు వెంటాడింది.

గత మంగళవారం రాత్రి మహేశ్వర్ రెడ్డి , ప్రశాంతి ఇద్దరు తమ పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దంపతులు చనిపోయి విగాతజివులుగా పడివున్న వారిని .. చుట్టుపక్కల రైతులు ఉదయాన్నేగమనించి గ్రామంలో తమ భందు వర్గానికి తెలియజేశారు .

ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో.. వెలుగోడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు .

ఘటనా స్థలానికి ఆత్మకూరు డియస్ ఫై రామంజినాయక్ వెళ్లి పరిశించారు .ఆత్మహత్యకు గల కారణాలపై అరా తీశారు .

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

“కాయ్ రాజా కాయ్” అంటూ ఒకప్పుడు తిరునాళ్లల్లో కనిపించిన పందేలు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ వేదికగా జడలు విప్పాయి.

మొబైల్ యాప్ లలో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.

ఆన్ లైన్ బూతానికి రెండు నిండు ప్రాణాలు భళి అయ్యాయి . అద్బుల్లాపురంలో జరిగిన ఈ ఘటన నంద్యాల జిల్లా లో సంచలనంగా మారింది .

దంపతుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

డబ్బులు సంపాదించడం ఎలా?’ అని ఇంటర్నెట్లో ఒక్కసారి సెర్చ్ చేస్తే లెక్కలేనన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో ఈజీ మనీ కోసం వెతికేవారికి ఆన్లైన్ రమ్మీ అని, ఐపీఎల్ బెట్టింగ్ అని, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్ అని ఎన్నో సైట్స్, యాప్స్ ప్రత్యక్షమవుతున్నాయి.

దీంతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్ ను సరదాగా మొదలుపెట్టి.. చివరికి అడిక్ట్ అయి.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆన్ లైన్లోనే అప్పులు సైతం దొరుకుతుండడం ఈ సమస్యను మరింతగా పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top