మద్దిలేటి స్వామిని దర్శించుకున్న మంత్రి బీసీ కుటుంబం

bc-janardhan-reddy-minister-maddileti-swamy-temple-01.jpg

మద్దిలేటి స్వామి వారిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు

బేతంచర్ల: నంద్యాల జిల్లా, బేతంచెర్ల మండలంలో శ్రీ మద్దిలేటి స్వామి వారి ఆలయాన్ని రాఫ్ట్ర రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి హోదాలో తొలిసారిగా కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన బీసీ జనార్దన్ రెడ్డిికి, ఆలయ అర్చకులు , అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఆ‍హ్వానం ఘన స్వాగతం పలికారు. ఆలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మద్దిలేటి స్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లాలని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో బనగానపల్లె ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని ప్రార్థించినట్లు బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జనార్థన్ రెడ్డితో పాటు, ఆ‍యన సతీమణి శ్రీమతి బీసీ ఇందిర రెడ్డి, కుమార్తె బీసీ మనోరమారెడ్డి, తదితర కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top