రైల్వే స్టేషన్ మాస్టర్ కి సన్మానం – ప్రజాసంఘాల నాయకులు

Tribute-to-the-Railway-Station-Master-1.jpg

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ మాస్టర్ వివేకానంద రెడ్డికి ఆత్మీయ సన్మానం

ఈ సందర్బంగా ప్రజా సంఘాల నాయకులు
ఎం సుధాకర్, పల్లె నరసింహ రెడ్డి
బందెల ఓబులేసు,వడ్డే సుబ్బారాయుడు లు మాట్లాడుతూ గుంటూరు నుండి తిరుపతి కి వెళ్లే రైలు ను కోయిలకుంట్ల రైల్వే స్టేషన్లో ఆపాలని గత నాలుగు నెలల కిందట ప్రజాసంఘాల నాయకులు రైల్వే స్టేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించడం జరిగింది.

అందులో భాగంగానే ఈరోజు ప్రజా సంఘలా నాయకులు స్థానిక రైల్వే స్టేషన్ మాస్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఆయనకు పూలమాలతో సత్కారి0చారు.ముఖ్యంగా
గౌ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారికి అలాగే బనగానపల్లె శాసనసభ సభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసారు.

రైల్వే స్టేషన్ మాస్టర్ గారితో వారు మాట్లాడుతూ..
కోయిలకుంట్ల రైల్వే స్టేషన్లో
రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని వారు ఆయన్ని కోరారు.

రైల్వే స్టేషన్ కు రావాలంటే ఇరువైపులా సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని రాబోవు కాలం లో ఏ కొత్త రైలు ను నడిపిన కోయిలకుంట్ల లో ఆపే విధంగా రైల్వే ఉన్నతధికారుల ద్రుష్టి కి తీసుకుపోవాలని వారు కోరారు.
ముఖ్యంగా ప్రజా సంఘలా నాయకులు మాట్లాడుతూ కోయిలకుంట్ల ప్రజల ఆకాంక్ష రైల్వే స్టేషన్, ఆ యొక్క కోరిక నెరవేర్చిన మహనీయుడు శ్రీ పెండెకంటి వెంకట సుబ్బయ్య గారిని కోయిలకుంట్ల ప్రజలు ఎల్లపుడు ఆయన్ను మర్చిపోరని వారు అన్నారు.మరీ ముఖ్యంగా కోయిలకుంట్ల రైల్వే స్టేషన్ కు ఆయన పేరు నామకరణం చేయాలనీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో విశ్రాంత ఉపాధ్యాయులు నారాయణ సార్ యువజన సంఘం నాయకులు మాబుహుస్సేన్, మురళి లు తదితరులు ఫాల్గోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top