చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన
నాగిని రవిసింగారెడ్డి …
నంద్యాల మండలం చాపిరేవుల లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి కాలిన గాయాలు అయ్యాయి. గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన విషం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్ సతీమణి నాగిని రవి సింగారెడ్డి ప్రమాద బాధితులను కలిసి వివరాలను తెలుసుకొని, పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు వైద్య అధికారులను ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరడం జరిగింది. బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందించారు.
ఈ సందర్భంగా నాగిని రవి సింగిరెడ్డి మాట్లాడుతూ… ప్రమాదం జరగడం దురదృష్ట కరమని, ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరడం జరిగింది. మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వము ఆర్థికంగా సాయం అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఆదిరెడ్డి, భాస్కర్ రెడ్డి