మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం విశిస్టత

Details of MaddiletiNarasimhaSwamy Temple

Details of MaddiletiNarasimhaSwamy Temple

AP ; మద్దిలేటి స్వామి

మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం

శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు తమ భార్యతో ఆనంద సమయంలో పాచికలు ఆడుతూ ఆ ఆటలో ఓడిపోతారు.

ప్రభువుపై విజయాన్ని సాధించిన లక్ష్మీ వారు స్వామి వారిని హేళన గా మాట్లాడుతారు. అప్పుడు స్వామి వారు ఆ ప్రదేశాన్ని వదిలి స్వతహాగా ఉండేందుకు..

ఎర్రమల, నల్లమల కొండలలో ఒక ప్రదేశము కోసం అన్వేషణ చేస్తారు. ఆయన యాగంటి వద్ద శ్రీ ఉమా మహేశ్వర స్వామిని కలుసుకుని..

ఆయన నివాస స్థలము కోసం సలహా కోరుతారు. ఆయన కోరిక మేరకు ఉమా మహేశ్వర స్వామి వారు మద్దిలేరు కాలువ పక్కన వున్న ఆలయ ప్రదేశంలోకి నడిపిస్తారు.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

మద్దిలేరు కాలువ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొక్షపట్టణం ను కన్నప్ప దొర వారు పాలిస్తుంటారు. కన్నప్ప దొర ప్రతి శనివారం అడవికి వెళ్ళేవారు.

అలా అడవిలో వెళుతున్నప్పుడు అతనికి ఒక ఉడుము ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అప్పుడు కన్నప్ప దొర ఆ ఉడుముని పట్టుకోవాలని తన సైనికులను ఆదేశించారు.

ఆ సైనికులు అనేక మార్గాలో పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు. చివరికి ఆ ఉడుము కోమలి అని పిలవబడే పుట్ట ప్రవేశిస్తుంది.

అప్పుడు ఆ సైనికులు పుట్టను త్రవ్విస్తారు కానీ ఉడుము కనబడదు.కన్నప్ప దొర తిరిగి తన రాజ్యానికి చేరుకుంటారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

అదే రోజు రాత్రి స్వామి వారు రాజు యొక్క కలలో కనిపించి,ప్రొద్దున నీకు ఉడుములా కనిపించి పుట్టలోకి ప్రవేశించింది నేనే అని వెల్లడిస్తారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు వేద పండితులతో పుట్ట వద్దకు చేరుకొని స్వామి వారికి పూజలు చేస్తారు.

రాజు వారు పూజలతో సంతోషించిన స్వామి వారు 10 సంవత్సరాల బాలుడి రూపంలో పుట్ట నుండి బయటకు వస్తారు.

అప్పుడు రాజు వారు 10 సంవత్సరాల బాలుడిని ఎత్తుకొని మద్దిలేరు కాలువ దగ్గరకు తీసికొనివచ్చి కూర్చోబెట్టి పూజలు చేసిన తరువాత స్వామి వారు శిల రూపంలోకి మారిపోతారు.

మద్దిలేరు కాలువ పక్కనే నరసింహ స్వామి ప్రత్యక్షంగా కనబడినందున ఈ స్థలం మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం అని పిలువబడింది.

ఈ క్షేత్రం ను బనగానపల్లె మండలం క్రిష్ణగిరి మెట్ట నుండి కాలినడకన లేదా బేతంచెర్ల మండలం RS రంగాపురం నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మద్దిలేటి స్వామి యొక్క చరిత్ర ఎంతో ప్రతిష్టమైనదని పూజారి పూజారి శర్మ శాస్త్రి తెలియజేశారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామిగా పిలువబడుతుంది. లక్ష్మీదేవి పాచికలు ఆడుతూ ఒకానొక సందర్భంగా..

లక్ష్మీదేవి ఆ పాచికలు ఆటలో గెలుపొందడంతో అక్కడ స్వామి వారిని అవహేళనగా మాట్లాడడంతో స్వామి వారు ఎరుమల కొండలకు రావడం జరుగుతుంది.

లక్ష్మీ నరసింహస్వామికి మిత్రుడు..యాగంటి ఈశ్వరుడు

వచ్చిన తర్వాత లక్ష్మీనరసింహస్వామికి ముఖ్య మిత్రుడు, యాగంటి ఈశ్వరుడు, యాగంటి ఈశ్వరి దగ్గరికి లక్ష్మీ నరసింహ స్వామి..

అత్యంత కోపంతో వస్తున్నటువంటి సందర్భంలో,యాగంటి ఈశ్వరుడు చూసి మా మిత్రుడు ఇంత కోపంతో ఎందుకు వస్తున్నాడని,

భార్యాభర్తలు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి,మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి కోపాన్ని తగ్గించి, కాళ్లు కడుక్కోమని స్వామి వారికి నీరు ఇచ్చి శాంత పరచడం జరిగింది.

ఎందుకు స్వామి ఇంత కోపంగా వచ్చారు మీ సమస్య ఏంటి అని లక్ష్మీ నరసింహ స్వామిని యాగంటి ఈశ్వరుడు అడిగి తెలుసుకున్నారు.

నా భార్యతో చిన్న విషయంలో గొడవపడి నేను ఇక్కడికి వచ్చినాను. నేను ఎరమల కొండల్లో ఉందామని అనుకుంటున్నానని లక్ష్మీనరసింహస్వామి తెలియజేశారు.

యాగంటి ఈశ్వరుడు,పార్వతి దేవి ఇద్దరు కలిసి వచ్చి, ఎర్రమల కొండల్లో స్వామివారికి స్థలం కేటాయించి ఇక్కడ ప్రజలందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది.

ఇక్కడ మద్దిలేటి వనం ఉండడంతో వాటన్నిటిని చూసి లక్ష్మి నరసింహ స్వామి ఇక్కడే కొలువై ఉన్నాడు.

యాగంటి ఈశ్వరుడు,లక్ష్మీనరసింహస్వామితో, ఈ ఎర్రమల్ల కొండల్లో నువ్వు నిలువై ఉంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆనందంతో ..

వారి కోరికలు మీ దగ్గర చేరువేస్తారని యాగంటి ఈశ్వరుడు తెలియజేశారు.లక్ష్మీనరసింహస్వామి అవతారాన్ని ప్రజలు గుర్తుపట్టాలని,

లక్ష్మీనరసింహస్వామి ఆజ్ఞగా,ఉడుము అవతారాన్ని, లక్ష్మీనరసింహస్వామిగా ప్రజలందరూ కొలుస్తారని యాగంటి ఈశ్వరుడు తెలిపాడు .

అదేవిధంగా మోక్ష పదం అనే ధర్మరాజుకు,ఉడుము అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగింది.

అదే విధంగా, మోక్ష పదం రాజు, వారి బంటులచే ఉడుమును బంధించండి అదేదో కొత్త జంతువుల ఉంది అని మోక్షరాజు తెలిపారు.

ఆ ఉడుము రాజుకు,బంటులకు కనపడకుండా, మొగిలి వనం అనే పుట్టలోకి వెళ్లిపోయింది, బటులు అందరు కలిసి ఆ పుట్టను విలికి తీసి చూసిన ఎలాంటి లాభం లేకుండా పోయింది.

బటులు అందరూ నిరుత్సాహపడటం ,మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి,ఆ రాజుకు రాత్రి కలలో వచ్చి, రాజుకు పూర్తిగా వారి సమాచారం తెలియజేశారు.

నాది కదిరి వంశము. కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని నేను. ఎర్రమల కొండల్లో ఉండాలని నేను నిర్ణయించుకున్నానని,

ఉదయం 10 గంటలకు వస్తే నేను ఆ ఫోటోలో మీకు దర్శనం ఇస్తానని, మేళా తాళాలతో నన్ను ఎరుమల కొండల్లో శిలువై ఉంచాలని కోరుతాడు.

రాజు ఉదయం లేచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరిని తీసుకువెళ్లి, బ్యాండ్ మేళలతో స్వామివారి దగ్గరకు వెళ్తారనిపూజారి శర్మ శాస్త్రి న్యూస్ 18 తో తెలియజేశారు

#మద్దిలేటినరసింహస్వామి #రాయలసీమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top