- అనాస (పైనాపిల్ ) పంట సాగులో అధిక లాభాలు
అనాస పంట గిరిజన ప్రాంతాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో వర్షాధారిత పంట పండిస్తున్నారు. ఈ పంట మన రాష్ట్రంలో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలలోని గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అనాస పంటను అదనపు ఆదాయ వనరుగా భావిస్తారు. ఎందుకంటే పోడు భూముల్లో సాగు చేస్తున్న జీడిమామిడి, అరటి మొదలగు పండ్ల తోటలు, నీడనిచ్చే మొక్కల క్రింద అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అనాసను కొండవాలుకు అడ్డంగా సాగు చేస్తుండటం వల్ల వర్షపు నీటికి మట్టి కొట్టుకొని పోకుండా, భూమికోతకు గురికాకుండా ఉంటుంది.
వాతావరణం: అనాస ఉష్ణ మండల పంట. ఉష్ణతీవ్రత మధ్యరకంగా గల ప్రాంతాలు దీని సాగుకు చాలా అనుకూలం. ఇది తీర ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 15 నుండి 32 డిగ్రీల సెల్సియస్ అవసరమవుతుంది. సముద్ర మట్టానికి సుమారు 1100 మీటర్ల ఎత్తుగల ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. సాలీనా 150-300 సెం.మీ. వర్షపాతం అవసరమవుతుంది.
నేలలు: అనాస సాగుకి అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికి, ఇసుకతో కూడిన గరపనేలలు చాలా అనుకూలం. నల్లరేగడి నేలలు, నీరు నిలబడే నేలలు అనుకూలమైనవి కావు. నేలలో మట్టి సుమారు 40 నుండి 60 సెం.మీ. వరకు ఉండి రాయి కాని, కంకర కానీ లేకుండా ఉంటే మొక్క పెరుగుదల బాగా ఉంటుంది. ఉదజని సూచిక 5.5-6 వరకు గల గరపనేలలు సాగుకు అనుకూలమైనవి.
రకాలు: అనాసలో చాలా రకాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా సింహాచలం, క్యూ, క్వీన్ రకాలను సాగు చేస్తున్నారు.
క్యూ: మేలైన వాణిజ్యరకం. దీనిని ఎక్కువగా పండ్లను నిలువ చేసే ప్రక్రియలో ఉపయోగిస్తారు. పండు బరువు 1.5 నుండి 2.5 కిలోల వరకు ఉంటుంది. పండు మీద కన్నులు బాగా వెడల్పుగా ఉండి లోతుగా లేకుండా పైన ఉండటం వల్ల కవచం తీసేటప్పుడు గుజ్జు నష్టం తక్కువగా ఉంటుంది. పూర్తిగా పక్వానికి వచ్చిన పండు ముదురు పసుపు వర్ణంలోను, కండ మాత్రం లేత పసుపు వర్ణంలోనూ ఉంటుంది. పండులో పీచు పదార్థం లేకుండా ఎక్కువ రసం కలిగి తియ్యగా ఉంటుంది. ఇది అలస్యంగా పండే రకం. అంటే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కాయకోతకు వస్తుంది. అంతేకాకుండా వేరు పిలకలను కూడా తక్కువగా తొడుగుతుంది.
సింహాచలం
ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా సాగులో ఉన్న రకం ఇది. దీని పండు సుమారుగా 450 నుంచి 600 గ్రాముల బరువుంది చిన్న చిన్న కళ్ళు కలిసి ఉంటుంది. బాగా పక్వానికి వచ్చిన పండు కండ పసుపు రంగులో ఉండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాయ చిన్నగా, కోలగా ఉండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. పులపు ఎక్కువ. క్వీన్: కాయ గుజ్జు ముదురు పసుపు రంగులో ఉంటుంది. సువాసన గల రకం. కాయ 2 కిలోల వరకూ బరువు తూగుతుంది. మరిసియస్: పండు బరువు 1.3-1.6 కిలోలు, మంచి సువాసన గల రకం. తీపి ఎక్కువ.
ప్రవర్ధనం మరియు నాటడం: అనాసను ప్రధానంగా మూడు పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 1, వేరు పిలకలు, 2. కాండం పిలకలు 3. తల పిలకలు. వేరుపిలకలు (సక్కర్లు): ఈ రకం పిలకలు మొక్క మొదలు నుండి భూమికి దగ్గరగా పుట్టుకొని వస్తాయి. వేరుపిలకలు నాటిన 14-18 నెలలకు కాయలు కోతకెదుగుతాయి. రైతులు ప్రధానంగా వేరుపిలకల ద్వారానే అనాసను సాగు చేస్తారు. కాండం పిలకలు (స్లిప్స్): మొక్కల్లో కాయకు దిగువున, కాయ కాడమీద వచ్చే పిలకలను స్లిప్స్ అంటారు. ఇవి మొక్క నుండి ఎక్కువ సంఖ్యలో పుడతాయి. ఇవి సహజంగా సక్కర్ల కంటే పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఇవి నాటిన 20-22 నెలలకు కాయలు కోతకు వస్తాయి.
తలపిలకలు (క్రౌన్స్): అనాస పండు పైభాగాన ఉండే పిలకలను తల పిలకలు అంటారు. సక్కర్లు, స్లిప్స్ అందుబాటులో లేని పక్షంలో తలపిలకలను వాడతారు. వీటిని నాటిన 24 నెలల తర్వాత ఆలస్యంగా కాయలు కోతకు వస్తాయి. మంచి తోటలను పెంచడానికి 400 నుంచి 450 గ్రాముల బరువు గల సక్కర్లు గాని, 350 గ్రాముల బరువు గల స్లిప్స్ గాని ఉపయోగించాలి. నాటుకొనే పిలకలకు ఎటువంటి చీడపీడలు లేకుండా చూసుకోవాలి.
పిలకలు నాటే ముందు జాగ్రత్తలు :ఎంపిక చేసే పింకలు సుమారు 4 నుండి 6 నెలలు వయస్సు కలిగి ఉండాలి. బాగా దిగుబడి వచ్చే పంట పాలం నుండి పిలకలను ఎంపిక వేసుకోవాలి, పిలకలు నాటేటప్పుడు పిలక క్రింద రెండు ఆకుల వరుసలు తొలగించాలి. నాటడానికి ముందు పిలకలను తలక్రిందులుగా ఒకటి రెండు రోజులు ఎండబెట్టి ఒక శాతం బోర్డోమిశ్రమంలో ముంచి వీటిని ఆశించే తెగుళ్ళను అరికట్టవచ్చు, పిలకలను సేకరించిన తర్వాత కుప్పలు కుప్పలుగా అరబెట్టరాదు. కుల్మసోకే అవకాశం ఉంది. నాటే సమయం: పిలకలను జూలై నుండి ఆగస్టు నెల వరకు నాటుకోవచ్చు..
నాటే పద్ధతి
రెండు వరుసల పద్ధతి ద్వారా అవాన పంటను నాటుకోవాలి. వరుసల మధ్య 40 పెం.మీ. వరుసల్లో 45 సెం.మీ. ఎడమన మొక్కలు ఎదురెదురుగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి నాటుకోవాలి. రెండు ఇత వరుసల మధ్య దూరం 1.5 మీటర్లుండాలి. ఈ పద్దతిలో ఎకరాకు 6000-8000 పిలకలు అవసరమవుతాయి. ఈ పద్ధతి అవలంబిస్తే 5 కార్చి పంటలు తీసుకోవచ్చు, ఈ పద్ధతిలో మొక్కల రెండింటి మధ్య దూరమే కాకుండా వరుసల మధ్య దూరం కూడా బాగా తగ్గించి దగ్గరగా నాటుకోవచ్చు. ఈ పద్ధతిలో మొక్కల మధ్య 26. సెం.మీ., రెండు వరుసల మధ్య 60 సెం.మీ., రెండు ఆత వరుసల మధ్య 50 సెం.మీ. దూరం ఉండాలి. ఎకరాకు సుమారు 19,600 నుండి 21,200 పిలకలు అవసరమవుతాయి. అయితే ఏజన్సీ ప్రాంతంలో ముఖ్యంగా కొండబాలులో వాటేటప్పుడు రాళ్ళు బద్దంగా ఉంటాయి కాబట్టి మొక్కల సాంద్రత తగ్గుతుంది.
Also Read ఆరోగ్యానిచ్చే ఆహారపు పంటగా జొన్న
నేల తయారీ: ఎంపిక చేసిన వేలను రెండు మూడు సార్లు దున్ని గడ్డలు లేకుండా పొడిగా తయారు చేయాలి. అశాఖ దుక్కిలో ఎకరాకు 8 టన్నుల చివికిన పశువుల ఎరువు వేసి మట్టితో కలపాలి. రెండు జత వరుసల మధ్య 10-15 సెం.మీ.లోతు, 30 సెం.మీ. వెడల్పు గల కందడం తయారు చేసి మురుగు నీటి వసతి కల్పించాలి. అంతరకృషి;మొక్కలు నాటిన 2 నెలల నుండి త్రవ్వకం చేయకుండా కలుపు మొక్కలు ఏరి వేయాలి. వరుసల మధ్య ఎండుటాకులు లేదా ఎండుగడ్డి కప్పి కూడా కలుపు మొక్కలను నివారించుకోవచ్చు.. నీటి యాజమాన్యం: మొక్క నీటి ఎద్దడికి గురికాకుండా చేసవిలో 4-16 నీటి తడులు 15-20 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. కార్మి పంట ; ప్రధాన వంట వాయలు కోసిన వెంటనే ఒక్కొక్క మొక్కకు ఒక్క వేరుపిలకను ఉంచి మిగతావి తవ్వి తీసివేయాలి. అదేవిధంగా కాండం పిలకలు కూడా తీసివేయాలి. సిఫార్సు చేసిన ఎరువులను వేసి తడి ఇవ్వాలి. ఈ విధంగా సుమారు 4-6 కార్మి పంటల కొరకు 4-16 సంబరాలు ఉంచాలి.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
డా. వి. హరికుమార్ (6281440912), ఉద్యాన శాస్త్రవేత్త డా. యస్. అనూష, సన్నరాణ శాస్త్రవేత్త డా. యస్. కిరణ్ కుమార్, నస్నపోష శాస్త్రవేత్త డా. బి. సునీత, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త డా. సి.హెచ్, బాలకృష్ణ మళ్ళీ విభాగ శాస్త్రవేత్త, డా. యస్. నీలవేణి, విస్తరణ విభాగ శాస్త్రవేత్త కె. భాగ్యలక్ష్మి కెవికె సమన్వయకర్త కృషి విజ్ఞాన కేంద్రం. అముదాలవలస
#Pineapple #Anasa #పైనాపిల్ #అనాస #అనాసపండు