ఆదివాసీ గిరిజన చెంచులు

ADIVASI GIRIJANA CHENCHULU

ADIVASI GIRIJANA CHENCHULU

ఆదివాసుల నైసర్గిక, ప్రాదేశిక, పరంపరాగత ప్రత్యేకతలను నాశనం చేయడం ద్వారా భారతీయ సంస్కృతిలోని గొప్పతనమైన భిన్నత్వాన్ని పాలకులు దెబ్బతీస్తున్నారు. దేశ నాగరికతా మూలాలను ధ్వంసం చేస్తున్నారు. కార్పొరేటీకరణ అనేది అడవులకు, ఆదివాసీలకు పరిమితం కాకుండా, దేశంలోని అన్ని రంగాలకు విస్తరిస్తోంది

భారతదేశంలో జరుగుతున్న కార్పొరేటీకరణను ప్రశ్నిస్తున్న అడవి బిడ్డలపై ప్రభుత్వం రాజకీయ, సాంస్కృతిక నిర్బంధాలను ప్రయోగించింది.

వారిని అణచివేయడానికి కాన్సన్ ట్రేషన్ క్యాంపులు నడిపి, సాల్వాజుడుం, గ్రీన్ హంట్, సమా
ధాన్ ప్రహార్ వంటి మిలటరీ ఆపరేషన్లతో భౌతికంగా దాడి చేస్తోంది.

ఈ ఆదివాసీలను ఒక జాతిగా కూడా లేకుండా నిర్మూలించడానికి ఈ ఏడాది జనవరి నుంచి ‘ఆపరేషన్
కగార్ను అమలు చేస్తోంది. ఈ అమానుషమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, నాగరిక సమాజం అంగీకరించని మానవ హననాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రజాస్వామిక పద్ధతులలో జరుగుతున్న ఆదివాసీల పోరాటా నికి సంఘీభావం తెలుపుతున్నారు.

ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం’గా జరుపుకునే ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వారంగా నిర్వహిస్తున్నారు.

అడవినే నమ్ముకుని స్వయం పోషకంగా జీవిస్తున్న ఆదివాసీలకు తమదైన ఒక ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవన విధానం ఉంది.

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆదివాసీలు కూడా పాలుపంచుకున్నారు.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన కొత్త రాజ్యాంగం సంతరించుకున్న ఆధునిక యుగలక్షణాల్లో భాగంగా సమానత్వాన్ని తనలో ఇముడ్చుకుంది.

ఆదివాసీలకు అడవి పై ప్రత్యేక రక్షణ కల్పించి, వారి హక్కులను శాసనబద్ధం చేశారు. ఆది వాసీలు చేసిన పోరాటాల ఫలితంగా మరి కొన్ని హక్కులు కూడా సంక్రమించాయి.

అయినా వీరు ఎలాంటి అభివృద్ధికి నోచు కోకుండా, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవు తూనే ఉన్నారు.

దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒరిస్సా, మహా రాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశాలలో విస్తరించిన అడవిలోని ఆదివాసీలు నివసించే ప్రాంతంలో దాదాపు నలభై ఏళ్లుగా మైనింగ్ జరుగుతుండడంతో అడవులు, గుట్టలు, కొండలు, నదులు, వాగులు, వంకలు, భూమి, నీరు, గాలి కలుషిత మవుతూ ధ్వంసమైపోతున్నాయి. ఆది వాసీలు తమ మాతృకకు దూరమై పోతున్నారు.

ప్రపంచీకరణలో భాగంగా దేశంలో మొదలైన నూతన ఆర్థిక విధానాల వల్ల కార్పొరేట్ శక్తులకు అటవీ వనరులను కొల్లగొట్టాల్సిన అవసరం వచ్చింది.

దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆటవీ, భూసేకరణ చట్టాల్లో మార్పులు తీసు కొచ్చింది. ఫలితంగా తరతరాలుగా జీవిస్తున్న ఆటవీభూముల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతుండడంతో దేశంలో వారి జీవితం, జీవనోపాధి పూర్తిగా సంక్షోభంలో పడ్డాయి.

ఆదివాసీలపై రాజకీయంగా, సాంస్కృతికంగా నిర్బంధాలను ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం భౌతిక దాడులకు దిగింది. బీఎస్ఎఫ్ దళాలను దింపి, సైనిక శిబిరాలను పెట్టింది. వేల సంఖ్యలో ఆదివాసీలను చంపేసి, లెక్కలేనంత మందిని జైళ్లపాలు చేసి, స్త్రీలపై అత్యాచారాలు జరిపింది.

ఆది వాసీల నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్

ఆటవీ ఫలసాయాన్ని సేకరించకుండా, వ్యవసాయాన్ని చేయకుండా ఆటంకాలు ఏర్పరచింది. గత ఏడాది ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో..

గత జనవరి నుంచి ఆది వాసీల నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ కగార్ను అమలుచేస్తోంది.

సరిహద్దుల్లో ఉండాల్సిన సైనిక బలగాలను ఆదివాసీ నివాస ప్రాంతాల్లో దింపి, గడిచిన ఆరునెలల్లో 140 మంది ఆదివాసీలను హతమార్చింది.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ఆదివాసీలకు నాయకత్వం వహిస్తున్న మూలవాసీ బచావ్ మంచ్ నాయకులను అరెస్టు చేసి జైళ్లలో పెడుతోంది.

ఆదివాసీలపై ప్రభుత్వం షెల్లింగ్ దాడులు చేయడం, వారి నివాసాలపై హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేయడం మానవ వ్యతిరేకమైనవి.

ఆదివాసుల నైసర్గిక, ప్రాదేశిక, పరంపరాగత ప్రత్యేకతలను నాశనం చేయడం ద్వారా భారతీయ సంస్కృతిలోని గొప్పతనమైన భిన్నత్వాన్ని పాలకులు దెబ్బతీస్తున్నారు. దేశ నాగరికతా మూలాలను ధ్వంసం చేస్తున్నారు.

కార్పొరేటీకరణ అనేది అడవులకు, ఆదివాసీలకు పరిమితం కాకుండా, దేశంలోని అన్ని రంగాలకు విస్తరిస్తోంది.

ప్రజల రక్తమాంసాలతో తయారైన పబ్లిక్ రంగాన్ని, ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లోని అపార సహజ వనరులనూ కార్పొరేట్లకు అప్పగించడానికి దేశమంతా రాజకీయార్థిక వ్యూహం అమలవుతోంది. దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలతో పాటు మేధావులు కూడా కదులుతున్నారు.

ప్రజాస్వామిక హక్కులే కాకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కులకు కూడా ప్రమాదం ఏర్పడి, జీవించే హక్కుకు విపత్తుగా మారిపోయింది.

ఈ హక్కుల ఉల్లంఘనను రాజ్యాంగ ప్రాతిపదికన వ్యతిరేకించాలి.

ఆదివాసీ హక్కుల పరిరక్షణకు మద్దతుగా నిలబడడమంటే మనకున్న మానవ హక్కులను కాపాడుకోవడమే. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా..

ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికలు ఏర్పడ్డాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవమైన ఈ నెల 9 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివాసీ పోరాట సంఘీబావ ప్రథమ జాతీయ సదస్సు జరగనుంది.

ఈ వేదిక ఆదివాసులు చేస్తున్న పోరాటంలోని న్యాయబద్ధతను వివరించనుంది. ఆదివాసులపై జరిగే సైనిక దాడులతో పాటు, వారిపై జరిగే అన్ని రకాల హింసలను ప్రజల దృష్టికి తీసుకురానున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top